జోడీ కుదిరింది
ABN , Publish Date - May 12 , 2025 | 04:52 AM
వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నారు ప్రదీప్ రంగనాథ్. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ‘డ్యూడ్’ అనే చిత్రం తెరకెక్కుతోంది...
వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నారు ప్రదీప్ రంగనాథ్. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ‘డ్యూడ్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవలె ప్రదీప్ రంగనాథ్ ఫస్ట్లుక్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మమిత బైజుకు సంబంధించిన లుక్ని విడుదల చేశారు. పోస్టర్లో ఇద్దరి జోడీ సరిగ్గా కుదిరింది. ప్రదీప్ రిలాక్స్ అవుతుండగా, మమిత స్టైలిష్ దుస్తులు, గాగుల్స్తో ఆకర్షిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నికేత్ బొమ్మి, సంగీతం సాయి అభ్యంకర్