Shankar Fire : ఈడీ తీరుపై శంకర్ ఆగ్రహం

ABN , Publish Date - Feb 22 , 2025 | 06:28 AM

‘యందిరన్‌’ (రోబో) తమిళ చిత్రం కథా చౌర్యానికి సంబంధించిన కేసులో రూ.10.11 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెండ్‌ విభాగం (ఈడీ) అధికారులపై దర్శకుడు శంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యందిరన్‌’ (రోబో) తమిళ చిత్రం కథా చౌర్యానికి సంబంధించిన కేసులో రూ.10.11 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెండ్‌ విభాగం (ఈడీ) అధికారులపై దర్శకుడు శంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘యందిరన్‌’ చిత్రం నిర్మాణ సమయంలో ఆ చిత్ర కథా సంబంధిత వివాదంలో అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణలో భాగంగా ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ గురువారం తన ఎక్స్‌పేజీలో ప్రకటన వెలువరించింది. ఈ చర్యను శంకర్‌ తీవ్రంగా ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ‘యందిరన్‌’ కథకు సంబంధించిన కేసులో పిటిషనర్‌ ఆరూర్‌ తమిళ్‌నాడాన్‌ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చిందని, ఆ కోర్టు తీర్పును విశ్వసించకుండా కేవలం ఫిర్యాదు ఆధారంగా ఈడీ తన ఆస్తులను జప్తు చేసిందని, ఈ చర్య చట్ట వ్యతిరేకమని, అధికారులు తమ చర్యలను పునః సమీక్ష జరుపుతారని తాను భావిస్తున్నానని చెప్పారు. జప్తు చర్యను ఉపసంహరించుకోకపోతే ఈడీ ఉత్తర్వును సవాలు చేస్తూ అప్పీలుకు వెళతానని శంకర్‌ పేర్కొన్నారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Feb 22 , 2025 | 09:07 AM