వేడుకను విజయవంతం చేయండి

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:42 AM

పద్నాలుగు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తోన్న గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల వేడుకను విజయవంతం చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు కోరారు....

పద్నాలుగు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తోన్న గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల వేడుకను విజయవంతం చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు కోరారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విమాన ప్రమాద దుర్ఘటన కారణంగా మంత్రి కోమటిరెడ్డి ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఈనెల 14న హైటెక్స్‌లో నిర్వహిస్తోన్న అవార్డుల బహూకరణ కార్యక్రమాన్ని ఐఅండ్‌పీఆర్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతలకు కలిపి నాలుగు అవార్డులను ప్రదానం చేస్తున్నాం. ఇలా ప్రతి ఏడాదిలో మూడు ఉత్తమ చిత్రాలకు అందజేస్తున్నాం. 2024 సంవత్సరానికి ప్రకటించిన అన్ని అవార్డులను కూడా ఇస్తున్నాం’ అని దిల్‌ రాజు తెలిపారు.

Updated Date - Jun 13 , 2025 | 01:42 AM