ఎంతో గర్వపడుతున్నాం
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:29 AM
తమిళ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. తమ తనయుడు....
తమిళ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. తమ తనయుడు యాత్ర గ్రాడ్యుయేషన్ డేలో వీరు పాల్గొన్నారు. ఈ ఫొటోను ధనుష్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘యాత్ర తల్లిదండ్రులుగా ఈ రోజు మేమిద్దరం ఎంతో గర్వపడుతున్నాం’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ‘చాలా రోజుల తర్వాత మీ ఇద్దరినీ ఇలా ఒకే ఫ్రేమ్లో చూడడం సంతోషంగా ఉంది’ అని కామెంట్ పెట్టారు. కాగా, ఇదే ఫొటోని రజనీకాంత్ కూడా ఎక్స్లో పోస్టు చేశారు. ‘నా మనవడు జీవితంలో మొదటి మైలురాయి దాటాడు. కాంగ్రాట్స్ యాత్ర కన్నా’ అని రాసుకొచ్చారు.