ధనుష్కు అనుకూలంగా కోర్టు తీర్పు
ABN, Publish Date - Jan 29 , 2025 | 01:40 AM
హీరోయిన్ నయనతార డాక్యుమెంటరీ కోసం తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీదాన్’ మూవీలోని మూడు సెకన్ల సన్నివేశాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ...
హీరోయిన్ నయనతార డాక్యుమెంటరీ కోసం తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీదాన్’ మూవీలోని మూడు సెకన్ల సన్నివేశాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని హీరో ధనుష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కొట్టివేయాలని కోరుతూ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.
చెన్నై, ఆంధ్రజ్యోతి