అమ్మవారి కథ

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:34 AM

నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్‌బీజే క్రియేషన్స్‌, మదర్‌ అండ్‌ ఫాదర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న సినిమా ‘చండీ దుర్గమా’. మైను ఖాన్‌ ఎండీ దర్శకత్వంలో...

నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్‌బీజే క్రియేషన్స్‌, మదర్‌ అండ్‌ ఫాదర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న సినిమా ‘చండీ దుర్గమా’. మైను ఖాన్‌ ఎండీ దర్శకత్వంలో జయశ్రీ వెల్ది నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. హాస్య నటుడు అలీ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. నటుడు చిట్టి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ‘అమ్మవారి కథతో వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంకే, సినిమాటోగ్రఫీ: వై.ఎ్‌స.కృష్ణ.

Updated Date - Jun 10 , 2025 | 05:34 AM