Bachelors Prema Kathalu Movie: సీక్వెల్ చిత్రం
ABN , Publish Date - Jun 07 , 2025 | 05:59 AM
గీతా సింగ్, కార్తీక్, కాశీ మదన్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘బ్యాచిలర్స్ ప్రేమకథలు’. ఎం.ఎన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలైంది.
గీతా సింగ్, కార్తీక్, కాశీ మదన్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘బ్యాచిలర్స్ ప్రేమకథలు’. ఎం.ఎన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలైంది. తొలి షాట్కు దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచాన్చేయగా, దర్శకుడు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ‘నా గత చిత్రం ‘కాలం రాసిన ప్రేమకథలు’ చిత్రానికి చక్కటి ప్రేక్షకాదరణ దక్కింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా ‘బ్యాచిలర్స్ ప్రేమకథలు’ తెరకెక్కిస్తున్నా. ఇందులో వినోదంతో పాటు నేటి సమాజానికి మంచి సందేశం ఇవ్వబోతున్నాం. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు.