Akkineni Akhil Wedding: గర్ల్‌ఫ్రెండ్‌తో అఖిల్‌ వివాహం

ABN , Publish Date - Jun 07 , 2025 | 06:15 AM

యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న జైనబ్‌తో ఆయన వివాహం శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర గంటలకు జరిగింది.

Akkineni Akhil Wedding: యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న జైనబ్‌తో ఆయన వివాహం శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర గంటలకు జరిగింది. నాగార్జున నివాసంలో తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. గత ఏడాది నవంబర్‌లో అఖిల్‌, జైనబ్‌ల నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే. తన కుమారుడి పెళ్లి విషయాన్ని వెల్లడిస్తూ నాగార్జున సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అలాగే కుమారుడి పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనందం పట్టలేక నాగార్జున డ్యాన్స్‌ చేసిన వీడియో కూడా వైరల్‌ అయింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన జైనబ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌. జైనబ్‌ తండ్రి జూల్ఫీరవ్ధ్‌జీ వ్యాపారవేత్త. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన సన్నిహితుడనే వార్తలు వినిపించాయి. జైనబ్‌ నటి కూడా.


2004లో వచ్చిన ‘మీనాక్షి.. ద టేల్‌ ఆఫ్‌ త్రీ సిటీస్‌’ చిత్రంలో ఆమె నటించారు. ఆ చిత్రానికి ఎఫ్‌ హుస్సేన్‌ దర్శకుడు. అఖిల్‌ కంటే వయసులో ఆమె తొమ్మిదేళ్లు పెద్ద. రెండేళ్ల క్రితం పరిచయమై ప్రేమలో పడిన అఖిల్‌, జైనబ్‌ పెద్దల అనుమతితో ఇప్పుడు వివాహం చేసుకున్నారు. ఆదివారం గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అఖిల్‌కు 2016లో వ్యాపార దిగ్గజం జి.వి. కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం జరిగింది. 2017లో వీరి వివాహం జరగాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల రద్దయింది.

Updated Date - Jun 07 , 2025 | 06:15 AM