NTR-War2: ఇంకా 50 రోజులు.. కౌంట్డౌన్ స్టార్ట్..
ABN , Publish Date - Jun 26 , 2025 | 02:34 PM
వార్ 2 విడుదలను వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తారక్. సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర బృందం కౌంట్డౌన్ మొదలుపెట్టింది. సినిమాలోని ప్రధాన నటీనటుల సరికొత్త పోస్టర్లను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రచార చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు
హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ (Ntr) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’ (war 2). అయాన్ ముఖర్జీ దర్శకుడు. కియారా అడ్వాణీ కథానాయిక. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరో 50 రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర బృందం కౌంట్డౌన్ మొదలుపెట్టింది. సినిమాలోని ప్రధాన నటీనటుల సరికొత్త పోస్టర్లను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రచార చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్న ఎన్టీఆర్.. ‘‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి వార్ను మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్డౌన్ మొదలుపెట్టండి’ అని పేర్కొన్నారు.
యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై 2019లో విడుదలైన ‘వార్’కు సీక్వెల్గా వస్తున్న చిత్రమిది. ఆగస్టు 14న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘‘వార్’కు కొనసాగింపుగా వస్తోన్న చిత్రం కావడంతో ‘వార్ 2’ విషయంలో నాపై ఎంతో బాధ్యత ఉంది. ఇది నాకు దొరికిన గొప్ప అవకాశం. ఇలాంటి భారీ ప్రాజెక్ట్లో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకొని తెరకెక్కిస్తున్నా’ అని అన్నారు.
‘మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్ పుస్తకంతో..
'వార్ 2’కు సంబంధించిన సాంగ్ చిత్రీకరణలో భాగంగా గురువారం ఎన్టీఆర్ ముంబయి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ఆయన్ని ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఆయన చేతిలోని ‘మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విస్డమ్’ పుస్తకం కనిపించింది. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించిన ఈ పుస్తకంలో కార్తికేయుడి గురించి వివరించారు. దీనిని బట్టి తదుపరి త్రివిక్రమ్తో చేయనున్న ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ సిద్దమవుతున్నారని.. అందుకే ఆ పుస్తకం చదువుతున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ ఇటీవల నిర్మాత నాగవంశీ ఆసక్తికర పోస్టులు పెట్టారు. కార్తికేయుడి పద్యాన్ని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు.