Sunjay Kapoor: బాలీవుడ్‌లో విషాదం.. పోలో ఆడుతూ.. క‌రిష్మా క‌పూర్ భ‌ర్త క‌న్నుమూత‌

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:23 AM

బాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి, అల‌నాటి అగ్ర తార క‌రిష్మా క‌పూర్ భ‌ర్త ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ సంజ‌య్ క‌పూర్ (53) గురువారం రాత్రి లండ‌న్‌లో మృతి చెందాడు.

karishma

బాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి, అల‌నాటి అగ్ర తార క‌రిష్మా క‌పూర్ (Karisma Kapoor) భ‌ర్త ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ సంజ‌య్ క‌పూర్ (53) (Sunjay Kapur) గురువారం రాత్రి లండ‌న్‌లో మృతి చెందాడు. 1990ల‌లో బాలీవుడ్‌ను ఏలిన క‌రిష్మా క‌పూర్ 2003లో సంజ‌య్ క‌పూర్‌ను వివాహం చేసుకుని లండ‌న్‌లో సైటిల్ అయింది. వీరికి ఇద్ద‌రు పిల్లలు. అయితే 2014లో వీరిద్ద‌రు విడిపోయి 2016లో డైవ‌ర్స్ తీసుకోగా సంజ‌య్ క‌పూర్ ప్రియా స‌చ్‌దేవ్‌ను రెండో వివాహాం చేసుకున్నాడు.

GtQ1XqZXkAAta6u.jpg

ఆపై క‌రిష్మా క‌పూర్ ఒంట‌రిగానే ఇండియాలో ఉంటుంది. ఇదిలాఉంటే మంచి పోలో ప్లేయ‌ర్ అయిన సంజ‌య్ (Sunjay Kapur) గురువారం పోలో ఆడుతుండ‌గా స‌డ‌న్‌గా హార్ట్ ఎటాక్‌కు గురై క‌న్నుముశారు. అయితే.. సంజ‌య్ ఆటాడుతున్న‌ స‌మ‌యంలో తేనెటీగ నోట్లోకి ప్ర‌వేశిండంతో గుండెపోటు వ‌చ్చి మ‌ర‌ణించి ఉంటాడ‌ని, వైద్యులు త‌క్ష‌ణ‌మే ప‌రీక్ష‌లు చేసిన‌ప్ప‌టికీ ప్రాణాలు కాపాడ‌లేక పోయార‌ని ప‌లు మీడియాలు ప్ర‌క‌టించాయి. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

Updated Date - Jun 13 , 2025 | 05:24 AM