Janhvi Kapoor: లండన్లో.. జాన్వీ పరువాల జాతర! నెట్టింట రచ్చ
ABN , Publish Date - Jun 16 , 2025 | 07:55 AM
అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ మరోమారు నెట్టింట రచ్చ లేపింది.
అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దేవర మినహా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ను తన ఖాతాలోకి వేసుకోక పోయినా వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాలీవుడ్లో దూసుకు పోతుంది. సినిమాల కన్నా తన అందాల విందుతోనే దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సమయం దరికితే ఆ అందాలను పంచుతూ కుర్రకారుకు మంచి ట్రీల్ను అందిస్తూ వస్తుంది.
నెల రోజులకో మారు అలా సడన్గా వచ్చి తన పరువాలను పరుస్తూ అందరి దృష్టిని తన వైపే తిప్పుకునే జాన్వీ మరోమారు అదే తరహాలో రకరకాల భంగిమల్లో వినూత్న వస్థ్రధారణతో చేసిన కొత్త ఫొటోషూట్ చూసే వారిని మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలో తాజాగా లండన్లో జరిగిన మియూ మియూ క్లబ్ (Miu Miu Club) ఈవెంట్కు హాజరైన జాన్వీ తన అల్ట్రా మోడ్రన్ డ్రెస్సింగ్తో మరోసారి నెట్టింట రచ్చ రేపింది. తన ఎద అందాలను వడ్డీ వారుస్తూ వీక్షకులకు కనువిందు చేసింది.
ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాల్ చల్ చేస్తున్నాయి. మీరూ ఒక్కసారి చూసి ఆస్వాదించేయండి మరి. ఇదిలాఉంటే జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్లో నాలుగు చిత్రాలు, తెలుగులో రామ్ చరణ్ పెద్ది, జూ ఎన్టీఆర్ దేవర2 సినిమాలు చేస్తోండగా అందులో రెండు హిందీ చిత్రాలు హోం బౌండ్, పరమ్ సుందరి విడుదలకు సిద్ధమయ్యాయి. అదేవిధంగా ఓ వెబ్ సిరీస్లోనూ నటించేందుకు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.