Dharmendra - Arbaaz Khan: ఆనాటి రోజుల్ని మళ్లీ మరిపిస్తాం

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:42 PM

బాలీవుడ్‌ నటులు ధర్మేంద్ర (Dharmendra)-అర్బాజ్‌ ఖాన్‌ (Arbaaz khan) ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’లో నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో పెద్ద హిట్‌ సినిమా ఇది.

బాలీవుడ్‌ నటులు ధర్మేంద్ర (Dharmendra)-అర్బాజ్‌ ఖాన్‌ (Arbaaz khan) ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’లో నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో పెద్ద హిట్‌ సినిమా ఇది. సోహైల్‌ ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించారు. ధర్మేంద్ర- ఆర్బాజ్‌ కీలక పాత్రల్లో కనిపించారు. 1998లో ఈ సినిమా విడుదలైంది. అయితే ఆ తర్వాత మళ్లీ క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. ధర్మేంద్ర, అర్భజ్‌ విడివిడిగా సినిమాలు చేశారు కానీ కలిసి నటించలేదు. ఇప్పటికి ఇద్దరు కలిసి నటించి 27 ఏళ్లు గడిచిపోయింది. అయితే ఇద్దరు మళ్లీ ‘మైనే ప్యార్‌ కియా పిర్‌ సే’ (Maine Pyaar Kiya Phir Se) చిత్రంలో నటిస్తున్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. షబీర్‌ షేక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ధరేంద్ర, ఆనందం వ్యక్తం చేశారు. ుూఆర్బాజ్‌ ఖాన్‌తో మళ్లీ కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో కలిసి చేయాలనుకుంటున్నా? ఆయన కూడా నాలాగే అనుకుంటున్నారు. అది ఇప్పటికీ కుదిరింది. ఆనాటి రోజుల్ని మళ్లీ మరిపిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. అయితే ఈ చిత్రం ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’కి కొనసాగింపా కాదా అన్నది చెప్పలేదు. టైటిల్‌ను బట్టి సీక్వెల్‌లా ఉందని బాలీవుడ్‌ అభిమానులు అంటున్నారు. అలాగే హీరో-హీరోయిన్‌ ఎవరు? అన్నది కూడా ప్రకటించలేదు. అప్పట్లో సల్మాన్‌ ఖాన్‌-కాజోల్‌ జంటగా నటించారు. ఇప్పుడు హీరో హీరోయిన్‌గా వారిద్దరూ నటించరు కాబట్టి ఆ పాత్రలకు నేటితరం నటీనటుల్ని తీసుకోనున్నారని తెలిసింది.

Updated Date - Jun 14 , 2025 | 03:48 PM