Pushpa 2: 'పుష్ప 2' లో ఐటమ్ సాంగ్ లో చేసే నటి ఎవరో తెలుసా!

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:18 PM

'పుష్ప' సినిమాలో సమంత, అల్లు అర్జున్ ల మీద చిత్రీకరించిన ఐటెం సాంగ్ 'ఊ అంటావా మావా' ఎంత పెద్ద హిట్ అయినదీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పుష్ప పార్టు 2 లో కూడా అంతకన్నా పెద్దగా వుండే విధంగా దర్శకుడు సుకుమార్ ఆలోచన చేస్తున్నట్టు గా తెలిసింది. అందుకే బాలీవుడ్ లో ఒక అగ్ర నటిని ఆ పాట కోసం తీసుకున్నట్టుగా తెలుస్తోంది

Pushpa 2: 'పుష్ప 2' లో ఐటమ్ సాంగ్ లో చేసే నటి ఎవరో తెలుసా!
Allu Arjun and Disha Pathani

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ వస్తున్న 'పుష్ప 2' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో కొన్ని రాజకీయ నేపధ్యం వున్న సన్నివేశాలని అల్లు అర్జున్, రావు రమేష్, ఫహద్ ఫాజిల్, ఇంకా మరికొంతమంది నటీనటులమీద చిత్రీకరణ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతుందని చిత్ర నిర్వాహకులు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.

alluarjunpushpa2.jpg

ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మొదటి పార్టు అయిన 'పుష్ప' లో సమంత ప్రత్యేక పాట 'ఊ అంటావా మావా' ఎంత ప్రాచుర్యం పొందింది అందరికీ తెలిసిన విషయమే. విడుదలైన రెండు సంవత్సరాలు అయినా ఆ పాట ఈరోజుకి చాలా ఈవెంట్స్ లో వేస్తున్నారు అంటే ఆ పాట ఎంత హిట్ అయిందన్న విషయం తెలుస్తోంది.

dishapatani.jpg

అయితే ఈ రెండో పార్టులో కూడా ఒక ఐటెం సాంగ్ ఉంటుందని చెపుతున్నారు. ఈ పాట కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటాని చేస్తోందని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు కూడా దిశా పటాని చేస్తోందని, ఈ పాట కూడా మొదటిపార్టులో పాట కన్నా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ పాట'కోసం త్వరలో ఒక సెట్ కూడా నిర్మించనున్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రానికి నిర్మాతలు.

Updated Date - Feb 13 , 2024 | 12:18 PM