SSMB29: మహేష్, రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి తండ్రి, సినిమా ఎప్పుడంటే...

ABN , Publish Date - Jan 20 , 2024 | 11:00 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా దర్శకుడు రాజమౌళితో చెయ్యబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతోంది, కథ తయారైందా లేదా అనే విషయాల గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు

SSMB29: మహేష్, రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి తండ్రి, సినిమా ఎప్పుడంటే...
Script work completed for Mahesh Babu and Rajamouli film

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సంక్రాంతికి విడుదలై ఇంకా థియేటర్స్ లో నడుస్తోంది. తన తదుపరి సినిమా అగ్ర దర్శకుడు రాజమౌళితో చెయ్యాలి. ఈ సినిమా గురించి అనేకరకాలైన వార్తలు అప్పుడే వైరల్ అవుతూ వస్తున్నాయి. అదీ కాకుండా మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం రాజమౌళి సినిమా కోసమే జర్మనీ వెళ్లారు అనే వార్త కూడా వైరల్ అయింది. సాంకేంతిక పనుల కోసం ఒక మూడు రోజుల వర్క్ షాపు అక్కడ ఏర్పాటు చేసారని, అందుకోసం మహేష్ వెళ్లారని ఒక వార్త వైరల్ అవుతోంది.

maheshbabupicistrending.jpg

ఇదిలా ఉండగా ఈ రాజమౌళి, మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయేంద్ర ప్రసాద్ ఈ రాజమౌళి, మహేష్ సినిమా గురించి కూడా ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు స్క్రిప్ట్ పని పూర్తయిపోయింది చెప్పారు. ఈ సినిమా కథ, స్క్రిప్ట్ పూర్తయిందని ఇక షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి అన్నట్టుగా విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

Rajamouli.jpg

ఈ సమాచారంతో మహేష్ అభిమానులు సామజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చెయ్యలేదు, ఈ రాజమౌళి సినిమాతో మహేష్ పాన్ ఇండియా సినిమా చెయ్యబోతున్నారు అని నిన్న 'గుంటూరు కారం' నిర్మాత నాగ వంశి చెప్పిన విషయం తెలిసిందే. అదీ కాకుండా మహేష్, రాజమౌళి సినిమాలో అన్ని భాషలకి చెందిన నటులతో పాటు, హాలీవుడ్ నటులు కూడా నటించే అవకాశం వుంది అని కూడా తెలుస్తోంది. రాజమౌళి తాను ఏ సినిమా ప్రారంభం చేసినా ముందుగా మీడియా సమావేశం పెట్టి ఆ సినిమా గురించిన విశేషాలను పంచుకోవటం అలవాటు. మరి మహేష్ బాబు సినిమాకి అదే పద్దతిని అనుసరిస్తారా, లేకా నేరుగా షూటింగ్ మొదలెట్టేస్తారా, చూడాలి మరి.

Updated Date - Jan 20 , 2024 | 11:00 AM