Rashmi Gautam: కల్చర్, కామ సూత్ర పుట్టిన నేలపై ఉన్నాం.. మెచ్యూరిటీ సాధించండి! ట్రోల‌ర్స్‌పై ర‌ష్మీ సీరియ‌స్

ABN , Publish Date - Jan 24 , 2024 | 03:39 PM

నిత్యం ఏదో ఒక అంశంతో వార్త‌ల్లో నిలిచే జ‌బ‌ర్ద‌స్త్ ర‌ష్మీ మ‌రోమారు వార్త‌ల్లోకెక్కి టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. సామాజిక మాధ్య‌మాల్లో చాలా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మా తాజాగా త‌న‌పై ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్‌కు తీవ్ర స్థాయిలో స్పందించింది. దీంతో ఈ వివాదం సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది.

Rashmi Gautam: కల్చర్, కామ సూత్ర పుట్టిన నేలపై ఉన్నాం.. మెచ్యూరిటీ సాధించండి! ట్రోల‌ర్స్‌పై ర‌ష్మీ సీరియ‌స్
rashmi

నిత్యం ఏదో ఒక అంశంతో వార్త‌ల్లో నిలిచే జ‌బ‌ర్ద‌స్త్ ర‌ష్మీ (rashmi gautam) మ‌రోమారు వార్త‌ల్లోకెక్కి టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. సామాజిక మాధ్య‌మాల్లో చాలా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మా తాజాగా త‌న‌పై ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్‌కు తీవ్ర స్థాయిలో స్పందించింది. దీంతో ఈ వివాదం సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది. బుల్లితెరపై యాంకర్ రష్మీ ఎంత‌ ఫాలోయింగ్ ఉందో నెట్టింట అన్ని కాంట్ర‌వ‌ర్సీలు కూడా ఉన్నాయి. అయితే రెండు రోజుల క్రితం అయోధ్య‌లో రామ మందిర (Ayodha RamMandir) ప్రారంభం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే ఈ క్ర‌మంలో ర‌ష్మీ త‌న‌ ఇంట్లో ఉండి కాషాయ చీర ధరించి శ్రీరాముడికి పూజ చేస్తున్నట్లు పేర్కొంది.

జనవరి 22న మ‌రో దీపావళి వేడుక‌ చేసుకోవాలని.. శ్రీరాముడు, సీత తమ ఇంటికి తిరిగి వచ్చిన మంచి సందర్భం ఇదంటూ రష్మీ ట్వీట్ చేసింది. ఇక‌ అప్పటి నుంచి రష్మీ (rashmi gautam)పై సోషల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో ట్రోలింగ్ మొద‌లైంది.ఓ నెటిజన్ హ‌ద్దులు దాటి మ‌రి కామెంట్స్‌ చేశాడు. మీరు చేసేవన్నీ లంగా పనులు.. కానీ కాషాయ చీర కట్టుకుని జై శ్రీరామ్ అంటే చేసిన పనులన్ని తుడిచి పెట్టుకు పోతాయా అంటూ విమ‌ర్శించాడు. దీంతో సీరియ‌స్ అయిన‌ రష్మీ ఆ నెటిజ‌న్‌కు ఘాటుగానే బదులిచ్చింది.


నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా ? నా తల్లి దండ్రులని కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేశానా ?నేను ట్యాక్సులు కట్టడం లేదా ? నేను ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు, ఆకృత్యాలు చేశానా ? ఒక వేళ అలాంటి పనులు చేస్తే నాపై కేసులు పెట్టండి. అసలు మీ దృష్టిలో లంగా పనులు అంటే ఏంటి ? కాషాయం చీర కట్టుకుని రామ నామ స్మరణలో ఉంటే నన్నెందుకు రెచ్చగొడుతున్నారు? పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. దేవుడు అందరివాడు. ధర్మాన్ని, కర్మని ఆధ్యాత్మికంగా బ్యాలన్స్ చేయడమే సనాతన ధర్మం గొప్పతనం అంటూ రష్మీ కౌంటర్ ఇచ్చింది.

మరో నెటిజన్ రష్మిని (rashmi gautam) ట్రోల్ చేస్తూ.. మీరు నిజంగానే సనాతన ధర్మం పాటిస్తే.. మీరు వెంటనే సినిమాల్లో, టీవీ షోలలో నటించడం మానేయాలి. అసభ్యకరమైన కంటెంట్ చూపించకూడదు. పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా ఎక్స్ ఫోజింగ్ చేయకూడదు. ఇవన్నీ ఆపేసి మంచి స‌మాజం కోసం ప్రయత్నించాలి అంటూ ఓ నెటిజన్ మండిపడ్డాడు. అతడికి కూడా రష్మీ (rashmi gautam) తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. లేదు.. నేను సినిమాలు, షోలు చేయడం మానను. మంచి అభివృద్ధి చెందుతున్న కల్చర్, కామ సూత్ర పుట్టిన నేలపై మనం ఉన్నాం. మీరు మీ మైండ్‌ని ఓపెన్‌గా ఉంచుకుని మెచ్యూరిటీ సాధించండి. మన మహిళలు ఎంతో సాధించగలరు అంటూ రష్మీ పేర్కొంది. నాపై ఎంతమంది ట్రోల్ చేసినా తాను చేసే పనులు చేస్తూనే ఉంటానని రష్మీ పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా చాలా మంది రష్మీకి మద్దతు తెలుపుతున్నారు.

Updated Date - Jan 24 , 2024 | 03:49 PM