Mahesh Babu: భార్యతో వున్న రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు, అదిప్పుడు వైరల్

ABN , Publish Date - Jan 02 , 2024 | 11:51 AM

మహేష్ బాబు తన భార్య నమ్రతను ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి కొత్త సంవత్సరం సందర్భంగా సామజిక మాధ్యమంలో పోస్ట్ చేసి, అభిమానులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షురాలు తెలిపారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అయింది.

Mahesh Babu: భార్యతో వున్న రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు, అదిప్పుడు వైరల్
Mahesh Babu shares a picture with his wife Namrata on the New Year day

కొత్త సంవత్సర వేడుకలను సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) ఎక్కువగా విదేశాల్లో జరుపుకుంటూ వుంటారు. అతను వీలైనంత సమయం తన కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతారు. అయితే ఈసారి మహేష్ బాబు దుబాయ్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఒక సాఫ్ట్ డ్రింక్ వ్యాపారాత్మక చిత్రీకరణ కూడా అక్కడ జరిగింది అని మహేష్ బాబు, నమ్రత (Namrata Shirodkar) పెట్టిన ఫోటోల ద్వారా తెలుస్తోంది. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో పాటు, తన వ్యక్తిగత సిబ్బందితో కూడా అందుకోసమే అక్కడికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

maheshbabuwithkids.jpg

ఇదిలా ఉండగా, మహేష్ బాబు ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తన అభిమానుల కోసం రొమాంటిక్ ఫోటో ఒకటి సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో తన భార్య నమ్రతని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో వుంది. ఈ ఇద్దరూ సోఫాలో కూర్చుని ఉండగా వున్న ఈ ఫోటో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

ఇదే కాకుండా, ఇంకా నమ్రత కూడా కొన్ని ఫోటోస్ షేర్ చేశారు. మహేష్ బాబు, గౌతమ్ ఆలా నడుచుకుంటూ వెళుతున్న ఫోటో, సితార ఫోటోస్ ఇలా కుటుంబ సభ్యులు అందరూ కొత్త సంవత్సరంలో ఎలాంటి ఆనందం, అనుభూతి చెందారనేది ఈ ఫోటోలతో తమ అభిమానులతో పంచుకున్నారు. మహేష్ బాబు మామూలుగానే కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు.

gautamsithara.jpg

తన పిల్లలకి కాలేజీ, స్కూల్ సెలవులప్పుడు తాను షూటింగ్ పెట్టుకోకుండా పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించడానికి ఇష్టపడతారు. అందుకోసం ఇలా విదేశీ ప్రయాణాలు పెట్టుకొని వాళ్ళతో సమయం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతారు. తనకి ఎక్కువ సంతోషం, ఆనందం ఇచ్చే సమయం కుటుంబంతో వున్నప్పుడే అని ఎన్నోసార్లు మహేష్ చెప్పిన విషయం తెలిసిందే.

ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ బాబు 'గుంటూరు కారం' #Gunur Kaaram షూటింగ్ పూర్తి చేశారు, ఆ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12 న విడుదలవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దీనికి దర్శకుడు, శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరిలు (Meenakshi Chaudhary) కథానాయికలుగా చేస్తున్నారు.

Updated Date - Jan 02 , 2024 | 11:51 AM