Mahesh Babu: ఇకపై మీరే నాకు అమ్మ, నాన్న.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేశ్ ఎమోషనల్

ABN , Publish Date - Jan 09 , 2024 | 09:43 PM

మహేశ్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గుంటూరులో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇకనుంచి ఫ్యాన్స్ మీరే నాకు అమ్మ, నాన్న, అన్నీ అంటూ ఎమోషనల్ అయ్యారు.

Mahesh Babu: ఇకపై మీరే నాకు అమ్మ, నాన్న..  గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేశ్ ఎమోషనల్
mahesh babu

ఇకనుంచి ఫ్యాన్స్ మీరే నాకు అమ్మ, నాన్న, అన్నీ అంటూ మహేశ్ బాబు (Mahesh Babu) ఎమోషనల్ అయ్యారు. తను హీరోగా త్రివిక్రమ్ కాంబినేషనల్ వస్తున్న గుంటూరు కారం (Guntur Karaam) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గుంటూరులో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్‌లో మా చిత్రం విడుదలైతే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా అదే రిపీట్‌ అవుతుంది. కానీ, ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనంద పడేవాడిని. ఫోన్‌ కాల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాడిని. ఆ సంగతులన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

‘గుంటూరులో ఈ సినిమా వేడుక జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్‌ చెప్పాలి. ‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎక్కడ నిర్వహించాలా?’ అని డిస్కస్ చేస్తుంటే మీ ఉర్లో చేద్దామని అన్నారు.. ఇదిగో ఇప్పుడు ఇక్కడే ఈవెంట్ జరుగుతున్నది. త్రివిక్రమ్‌ నాకు స్నేహితుడికంటే ఎక్కువ. కుటుంబ సభ్యుడి లాంటి వారు. గత రెండేళ్లుగా ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్‌ నేను ఎప్పటికీ మర్చిపోను. ‘అతడు’తో మా ప్రయాణం మొదలైంది. ‘ఖలేజా’తో మ్యాజిక్‌ జరిగింది. అదే మ్యాజిక్‌ ‘గుంటూరు కారం’లోనూ కనిపిస్తుంది. మీరు కొత్త మహేశ్‌బాబును చూడబోతున్నారన్నారు.


ఇక శ్రీలీల గురించి మాట్లాడుతూ కంగారుపడకమ్మా నీ గురించే మాట్లాడుతున్నా అంటూ నవ్వులు పూయించారు. చాలా కాలం తర్వాత ఓ తెలుగమ్మాయి శ్రీలీల పెద్ద హీరోయిన్‌గా రాణిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఈ అమ్మాయితో డ్యాన్స్ వేయడడం వామ్మో అదేం డ్యాన్సు హీరోలందరికీ తాట ఊడిపొద్ది అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సినిమాలో మేం అడగ్గానే ఏం ఆలోచించకుండా మీనాక్షి చౌదరి గెస్ట్ అప్పీయరెన్స్ చేసిందని థ్యాంక్స్ అని తెలిపారు. సంగీత దర్శకుడు తమన్‌ నా సోదరుడిలాంటివాడు. నేను, త్రివిక్రమ్‌ ఇచ్చిన సూచన మేరకు ‘కుర్చీ మడత పెట్టి’ పాటను కంపోజ్‌ చేశాడు. సినిమాలో ఆ పాట వచ్చినప్పుడు థియేటర్లు బద్దలైపోతాయి’ అని ఆసక్తి పెంచారు.

Updated Date - Jan 09 , 2024 | 09:53 PM