Guntur Kaaram: సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో.. ర‌మ‌ణ గాడి సంద‌డి! అభిమానుల‌తో క‌లిసి సినిమా చూసిన మ‌హేశ్‌బాబు

ABN , Publish Date - Jan 12 , 2024 | 06:59 PM

త్రివిక్ర‌మ్‌ శ్రీనివాస్, మ‌హేశ్‌బాబు కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా వ‌చ్చిన‌ మూడ‌వ చిత్రం గుంటూరు కారం సంక్రాంతి సంద‌ర్భంగా నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది.ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సుద‌ర్శ‌న్ 35 ఎంఎం థియేట‌ర్‌కు మ‌హేశ్‌బాబు ఫ్యామిలీతో వ‌చ్చి సినిమా తిల‌కించారు.

Guntur Kaaram: సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో.. ర‌మ‌ణ గాడి సంద‌డి! అభిమానుల‌తో క‌లిసి సినిమా చూసిన మ‌హేశ్‌బాబు
mahesh babu

త్రివిక్ర‌మ్‌ శ్రీనివాస్, సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు (Mahesh Babu) కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా వ‌చ్చిన‌ మూడ‌వ చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram) సంక్రాంతి సంద‌ర్భంగా నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌హేశ్‌బాబు సినిమా రిలీజ్ కావ‌డం, వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో 14 సంవ‌త్స‌రాల త‌ర్వాత వ‌స్తుండ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశ‌న్నంటాయి. ఈ క్ర‌మంలో పండుగ సెల‌వులు క‌లిసి రావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు.


ఈ క్ర‌మంలో శుక్ర‌వారం గుంటూరుకారం (Guntur Kaaram) సినిమా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న ఆర్టీస్ క్రాస్ రోడ్స్‌లోని సుద‌ర్శ‌న్ 35 ఎంఎం (Sudarshan) థియేట‌ర్‌కు మ‌హేశ్‌బాబు (Mahesh Babu) త‌న కుటుంబ స‌భ్యులు భార్య మ్ర‌తా శిరోద్క‌ర్‌, కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార‌, శిల్పా శిరోద్క‌ర్‌ల‌తో పాటు ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్‌ (Trivikram), వంశీ పైడిప‌ల్లి (Vamshi Paidipally)లు హ‌జ‌రై ప్రేక్ష‌కుల మ‌ధ్య చిత్రాన్ని తిల‌కించి అభిమానుల్లో జోష్‌ను పెంచారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Updated Date - Jan 12 , 2024 | 07:04 PM