Mahesh Babu: తెలుగులో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్క‌డు.. మ‌హేశ్‌బాబు

ABN , Publish Date - Jan 17 , 2024 | 07:17 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా వ‌చ్చిన మూడో చిత్రం ‘గుంటూరు కారం’ భారీ అంచ‌నాల మ‌ధ్య‌ జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రోజురోజుకు రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న‌ది.

Mahesh Babu: తెలుగులో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్క‌డు.. మ‌హేశ్‌బాబు
mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా వ‌చ్చిన మూడో చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య‌ సంక్రాంతి (Sankranthi) కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రోజురోజుకు రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న‌ది. సినిమాకు మొద‌ట్లో నెగిటివ్ టాక్ వ‌చ్చినా ఫ్యామిలీ ఆడియెన్స్ స‌పోర్ట్ అంత‌కంత‌కు పెర‌గ‌డంతో 5వ‌ రోజుకు కూడా రెండంకెల పైనే వ‌సూళ్లు సాధించడ‌మే కాకుండా ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి సాధ్యం గానీ రికార్డును మ‌హేశ్‌బాబు సొంతం చేసుకున్నాడు.


తొలి రోజునే రూ.94 కోట్ల వసూళ్లను సాధించి రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 5 రోజులు పూర్త‌య్యేస‌రికి ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో టాలీవుడ్‌లో రూ.100 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన ఏకైక‌ హీరోగా మ‌హేశ్‌బాబు (Super Star Mahesh Babu) చరిత్ర సృష్టించాడు.

వ‌రుస‌గా 5 చిత్రాలు భ‌ర‌త్ అనే నేను (Bharat Ane Nenu), మ‌హ‌ర్షి (Maharshi), స‌రిలేరు నీకెవ్వ‌రు (Sarileru Neekevaru), స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata), ఇప్పుడు గుంటూరు కారం (Guntur Kaaram) చిత్రాలు 100 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద‌ మ‌హేశ్ (Super Star Mahesh Babu) స్టామినాను మ‌రోసారి నిరూపించాయి.

Updated Date - Jan 17 , 2024 | 07:24 PM