Breaking News: సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య మృతి

ABN , Publish Date - Feb 15 , 2024 | 07:20 PM

దర్శకుధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మెజారిటీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహీ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. హీరోయిన్ అనుష్క శెట్టి దగ్గర చాలా కాలం పాటు ఆమె పని చేశారు.

Breaking News: సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య మృతి
Senthil Kumar and Roohi

దర్శకుధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మెజారిటీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహీ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. హీరోయిన్ అనుష్క శెట్టి దగ్గర చాలా కాలం పాటు ఆమె పని చేశారు. COVID-19 నుండి ఆమె ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో.. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో పాటు.. మల్టీపుల్ ఆర్గాన్స్ పనిచేయకపోవడంతో రూహీ తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు తెలుపుతున్నారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. (Senthil Kumar Wife Roohi)


Ruhee.jpg

సెంథిల్ కుమార్, రూహీలకు 2009లో వివాహమైంది. వారికి ర్యాన్ కార్తికేయన్, ధృవ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూహీ మరణ వార్త తెలిసిన వారంతా.. ఈ కష్టకాలంలో సెంథిల్‌కు ధైర్యాన్ని ఇవ్వమని దేవుడిని ప్రార్థిస్తున్నారు. రూహీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. సెంథిల్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా.. రూబీ అంత్యక్రియలను శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. (RipRuhee)

Senthil-Kumar.jpg

Updated Date - Feb 15 , 2024 | 07:51 PM