Vishwak Sen: 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' నుండి మాస్ పాట బయటకొచ్చింది!

ABN, Publish Date - Mar 25 , 2024 | 01:50 PM

విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమా నుండి రెండో పాటని ఈరోజు చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. కృష్ణ చైతన్య దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య నిర్మాతలుగా వస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు. చంద్రబోస్ రాసిన 'మోత' అనే ఒక మాస్ పాటని ఈరోజు విడుదల చేశారు. ఎంఎం మానసి ఈ పాటని పాడగా, విశ్వక్ సేన్, అయేషా ఖాన్ ల మీద ఈ పాటని చిత్రీకరించారు. గోదావరి నేపథ్యంలో ఒక పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే వున్నాయి. మొదటి ఈ సినిమా విడుదల కొన్ని తేదీలు ప్రకటించినా, ఎన్నికల నేపథ్యంలో చివరికి మే 17 అని ఖరారు చేశారు. ఇందులో నేహా శెట్టి కథానాయిక అని, అంజలి ఇంకో ప్రధాన పాత్రలో కనపడనున్నారని తెలుస్తోంది.

Updated at - Mar 25 , 2024 | 01:50 PM