Vijay Deverakonda: 'ఫ్యామిలీ స్టార్' నుండి లిరికల్ పాట విడుదల

ABN, Publish Date - Mar 25 , 2024 | 12:58 PM

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా 'ఫ్యామిలీ స్టార్'. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. పరశురామ్ దర్శకుడు, కాగా గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. విజయ్, పరశురామ్, గోపి సుందర్ ఇంతకు ముందు 'గీత గోవిందం' సినిమాకి పని చేశారు, ఇప్పుడు మళ్ళీ ఆ ముగ్గురూ ఈ 'ఫ్యామిలీ స్టార్' కి చేతులు కలిపారు. ఇంతకు ముందు సినిమా సంగీతపరంగా పెద్ద విజయం సాధించటమే కాకుండా, సినిమా కూడా విజయ్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా సాధించింది, ఇప్పుడు ఈ 'ఫ్యామిలీ స్టార్' కూడా అంతకన్నా పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు. ఈరోజు 'మధురం కదా' అనే ఒక లిరికల్ పాటని విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ పాటని శ్రేయ ఘోషల్ పాడారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రచారాలు మొదలెట్టారు, అందులో భాగంగానే ఇంతకుముందు రెండు పాటలను విడుదల చేశారు, ఇది ఇప్పుడు మూడవ పాట. విజయ్ దేవరకొండ ఈ 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో మళ్ళీ ప్రాభవంలోకి వస్తారని అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Updated at - Mar 25 , 2024 | 12:58 PM