Vishwambhara: సుదీర్ఘంగా సాగే షెడ్యూల్‌.. ఫినిష్‌ అంతే!

ABN , Publish Date - May 18 , 2024 | 01:53 PM

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర'(Vishwambhara) చిత్రంతో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Vishwambhara:  సుదీర్ఘంగా సాగే షెడ్యూల్‌.. ఫినిష్‌ అంతే!

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర'(Vishwambhara) చిత్రంతో బిజీగా ఉన్నారు. వశిష్ట (Vasshista) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని
యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫాంటసీ యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాముఖ్యం ఉంది. ఇలాంటి సినిమాలకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ చాలా కీలకం. అందుకోసం వీలైనంత ఎక్కువ సమయం తీసుకోవాలి. ఈ దిశగానే ‘విశ్వంభర’ టీమ్‌ వేగంగా అడుగులేస్తోంది. అందుకోసం టార్గెట్‌ కూడా ఫిక్స్‌ చేసుకొంది. జూన్‌ చివరి నాటికి షూటింగ్‌ మొత్తం పూర్తవ్వాలన్న లక్ష్యంతో చిత్ర బృందం పని చేస్తోంది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో కీలకమైన షెడ్యూల్‌  మొదలు కాబోతుంది. చిరంజీవి, త్రిషతో (Trisha) సహా మిగిలిన టీమ్‌ మొత్తం ఈ షెడ్యూల్‌లో భాగం కానున్నారు.

ఈ షెడ్యూల్‌లో పాటల్ని కూడా తెరకెక్కిస్తారట. చిన్న చిన్న బ్రేకులు మినహా.. జూన్‌ చివరి వారం వరకూ సుదీర్ఘంగా సాగే షెడ్యూల్‌ ఇది. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. జులై నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం అవుతాయని చిత్ర బృందం తెలిపింది. సీజీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుందని ఇప్పటికే దర్శకుడు చెప్పారు. అందుకోసం కొన్ని విదేశీ కంపెనీలను  చిత్రబృందం సంప్రదించబోతోంది. నవంబరులోగా సీజీ పనులు కూడా పూర్తవుతాయని టాక్‌. సంక్రాంతి సందర్భంగా జనవరి 10 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయిక.

Updated Date - May 18 , 2024 | 01:53 PM