Venkatesh: బాబు, ఎవరైనా కొంచెం త్రివిక్రమ్ కి ఫోన్ చేసి అడుగుతారా...

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:09 PM

వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారా లేదా అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. అదే విషయాన్ని వెంకటేష్ ని అడిగితే, అతను త్రివిక్రమ్ కి ఎవరైనా ఫోన్ చేసి అడగండి అని సరదాగా చెప్పారు.

Venkatesh: బాబు, ఎవరైనా కొంచెం త్రివిక్రమ్ కి ఫోన్ చేసి అడుగుతారా...
Venkatesh Daggubati

దగ్గుబాటి వెంకటేష్ కథానాయకుడిగా నటించిన 'సైంధవ్' ఈనెల 13న సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలవుతోంది. ఇది ఒక యాక్షన్ సినిమాగా రూపు దిద్దుకుంది అని తెలుస్తోంది. శైలేష్ కొలను దర్శకుడు, ఈరోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, ఈ సినిమా కథ వెంకటేష్ కుమార్తె చుట్టూ తిరుగుతోంది అని అర్థం అవుతోంది. అలాగే ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ వెంకటేష్ భార్యగా నటిస్తోంది. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి విలన్ గా నటిస్తున్నాడు. ఆర్య, ముకేష్ ఋషి కూడా వున్నారు.

venkatesh-saindhav2.jpg

అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా వెంకటేష్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా అంటున్నారు, అది ఎప్పుడు ఉండొచ్చు, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని అడిగారు. అయితే వెంటనే వెంకటేష్ దానికి సమాధానంగా 'బాబూ ఇప్పుడు ఎవరో ఒకరు త్రివిక్రమ్ కి కాల్ చేసి అడగండమ్మా' అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు.

దర్శకుడు త్రివిక్రమ్, వెంకటేష్, నాని తో ఒక సినిమా చేస్తున్నట్టుగా సామజిక మాధ్యమాల్లో, అలాగే కొన్ని మీడియాలో కూడా వార్తలు వస్తూ ఉండటంతో దీనిమీద వెంకటేష్ ని క్లారిటీ అడిగితే దానికి అతను సమాధానంగా త్రివిక్రమ్ ని అడిగితే బాగుంటుంది అని అన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:09 PM