Varun Tej: గోదావరి తీరాన మెగా ప్రిన్స్ దంపతులు.. పూజలు దేనికో?

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:46 PM

వరుణ్‌తేజ్‌(Varun Tej), లావణ్య త్రిపాఠిల (Lavanya tripati) వివాహం అనంతరం ఓసారి విహారానికి వెళ్లారు. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇద్దరూ సినిమాలపై ఫోకస్‌ పెట్టారు. ఇటీవల 'మిస్‌ పర్‌ఫెక్ట్‌' వెబ్‌ సిరీస్‌తో పలకరించింది లావణ్య.

Varun Tej: గోదావరి తీరాన మెగా ప్రిన్స్ దంపతులు.. పూజలు దేనికో?

వరుణ్‌తేజ్‌(Varun Tej), లావణ్య త్రిపాఠిల (Lavanya tripati) వివాహం అనంతరం ఓసారి విహారానికి వెళ్లారు. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇద్దరూ సినిమాలపై ఫోకస్‌ పెట్టారు. ఇటీవల 'మిస్‌ పర్‌ఫెక్ట్‌' వెబ్‌ సిరీస్‌తో పలకరించింది లావణ్య. మరోవైపు వరుణ్‌ తేజ్‌ కూడా 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నారు. తాజాగా వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి దంపతులు గోదావరిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని వరుణ్‌ తన i స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ఫోటోలో పూజారులు, వరుణ్‌ తేజ్‌ మాత్రమే ఉన్నారు. కానీ లావణ్య లేదు. అయితే ఆమె గోదావరిలోని పడవ ఫోటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వారిద్దరూ ఈ పూజల్లో ఎందుకు పాల్గొన్నారో అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వరుస పరాజయాలతో ఉన్న వరుణ్‌ కొత్త సినిమా 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' మంచి విజయాన్ని అందుకోవాలని గోదావరి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆయన హీరోగా నటించిన 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' (Operation Valentine) సినిమా ప్రీ రిలీజ్‌వేడుక  ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగనుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. శక్తి ప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లార్‌ కథానాయిక. 

Updated Date - Feb 25 , 2024 | 12:46 PM