Upasana: రాష్ట్రపతి  ద్రౌపది ముర్మును కలిసిన ఉపాసన!

ABN , Publish Date - Mar 16 , 2024 | 03:40 PM

రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన (Upasana) సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! తనకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లకు ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంటారు.

Upasana:  రాష్ట్రపతి  ద్రౌపది ముర్మును కలిసిన ఉపాసన!

రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన (Upasana) సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! తనకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లకు ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంటారు. ఇటీవల ఆమె క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును(Droupadi Murmu) కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ‘ప్రపంచ శాంతి కోసం జరుగుతోన్న గ్లోబల్‌ స్పిర్చువాలిటీ మహోత్సవ్‌లో దేశ  రాష్ట్రపతిని కలవడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు’’ అని పోస్ట్‌ పెట్టారు. వారితో దిగిన ఫొటోలను పంచుకున్నారు. 

అందులోనూ క్లీంకార ముఖం కనిపించకుండా ఉపాసన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ అందరూ ‘క్లీంకార ఫేస్‌ ఎప్పుడు చూపిస్తారు?’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవలే ఉపాసన అయోధ్యను సందర్శించారు. తన తాతయ్య అపోలో వ్యవస్థ్థాపకుడు ప్రతాప్‌ సి రెడ్డితో కలిసి బాలరాముడిని దర్శించుకున్నారు. దానికి ముందు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Updated Date - Mar 16 , 2024 | 03:43 PM