Upasana: నానమ్మ.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా పట్టడం లేదా?

ABN , Publish Date - Apr 20 , 2024 | 05:33 PM

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖ (Surekha)ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ (Athamas kitchen) పేరుతో ఫుడ్‌ బిజినెస్‌ మొదలుపెట్టారు.

Upasana: నానమ్మ.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా పట్టడం లేదా?

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖ (Surekha)ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ (Athamas kitchen) పేరుతో ఫుడ్‌ బిజినెస్‌ మొదలుపెట్టారు. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా, మనకు నచ్చే రుచికరమైన నాణ్యమైన డ్రై హోమ్‌ ఫుడ్స్‌ని అందించే లక్ష్యంతో దీనిని మొదలు పెట్టారు. తాజాగా ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ కోసం సురేఖ  మామిడికాయ పచ్చళ్లు (mango pickle) పెట్టారు. దీనికి సంబంధించిన ఓ సరదా వీడియోను ఉపాసన తాజాగా నెట్టింట షేర్‌ చేశారు. చిరంజీవి తల్లి అంజనా దేవి పర్యవేక్షణలో సురేఖ పచ్చడి కలుపుతూ కనిపించారు. అంజనా దేవిని ఉద్దేశించి ఉపాసన "నానమ్మా.. ఏంటి ఈ రోజు కోపంగా ఉన్నారు. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయడం లేదా?’’ అని ఉపాసన అడిగారు. అలా ఏమీ లేదని, నువ్వు ఉన్నావుగా ఆమెకు కోడలిగా’ అని అంజనాదేవి నవ్వుతూ బదులిచ్చారు. ‘‘లివింగ్‌ రూమ్‌ కిచెన్‌గా మారితే ఇలా ఉంటుంది..! అంజనాదేవి పర్యవేక్షణలో కొత్త ఆవకాయ సిద్ధం చేస్తున్నాం. మీరు కూడా అత్తమ్మాస్‌ కిచెన్‌ ఆవకాయ్‌ రుచి చూడాలనుకుంటున్నారా?’’ అని ఉపాసన వీడియోలో పేర్కొన్నారు.

‘‘ఈ వయసులో తన అభిరుచిని నెరవేర్చుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. మీ స్ఫూర్తికి సలామ్‌. ఇలాంటి అమ్మలు, అత్తమ్మలు ముందుకొచ్చి తమకు నచ్చిన వ్యాపారాలు ప్రారంభిస్తే మన దేశం ఆర్థికంగా ఎంతగా అభివృద్ధి సాధిస్తుంది ఒక్కసారి ఊహించండి’’ అని ఉపాసన గతంలో ఓ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే! 

Updated Date - Apr 20 , 2024 | 09:54 PM