TS Government: పద్మ పురస్కార గ్రహీతలను సత్కరించిన తెలంగాణ ప్రభుత్వం!

ABN , Publish Date - Feb 04 , 2024 | 01:00 PM

పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆదివారం మధ్యాహ్నాం శిల్పా కళావేదికలో జరిగిన ఈ వేడుకలో పద్మ విభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొన్నారు

TS Government: పద్మ పురస్కార గ్రహీతలను సత్కరించిన తెలంగాణ ప్రభుత్వం!

పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆదివారం మధ్యాహ్నాం శిల్పా కళావేదికలో జరిగిన ఈ వేడుకలో పద్మ విభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవి, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన కళాకారులు దాసరి కొండప్ప తదితరులు సీఎం రేవంత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ "మనవాళ్లను మనం గౌరవించుకోకపోతే.. ఎలా అనుకోవడం గొప్ప విషయం. అంతే కాదు మరచిపోయిన నంది అవార్డులను గుర్తు చేసుకుని ఆ స్థానంలో కొత్త అవార్డులు తీసుకురావడం శుభపరిణామం. గద్దర్‌ పేరుతో నంది అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని చిరంజీవి అన్నారు.

Updated Date - Feb 04 , 2024 | 01:10 PM