Pavithra Jayaram: ఘోర ప్ర‌మాదం.. తెలుగు సీరియ‌ల్ న‌టి దుర్మ‌ర‌ణం

ABN , Publish Date - May 12 , 2024 | 04:15 PM

ప్ర‌ముఖ తెలుగు, క‌న్న‌డ న‌టి ప‌విత్ర జ‌య‌రాం రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. జీ తెలుగులో వ‌స్తున్న త్రిన‌య‌ని సీరియ‌ల్‌లో తిలోత్త‌మ అనే నెగిటివ్ రోల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Pavithra Jayaram: ఘోర ప్ర‌మాదం.. తెలుగు సీరియ‌ల్ న‌టి దుర్మ‌ర‌ణం
pavitra

ప్ర‌ముఖ తెలుగు, క‌న్న‌డ న‌టి ప‌విత్ర జ‌య‌రాం (Pavithra Jayaram) రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. జీ తెలుగులో వ‌స్తున్న త్రిన‌య‌ని (Trinayani) సీరియ‌ల్‌లో తిలోత్త‌మ అనే నెగిటివ్ రోల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ న‌టి అంత‌కుముందు తెలుగులో నిన్నే పెళ్లాడ‌తా, స్వ‌ర్ణా ప్యాలెస్‌, కోడ‌ళ్లు మీకు జోహ‌ర్లు అనే సీరియ‌ల్స్‌లోనూ ప్ర‌తినాయిక పాత్ర‌ల‌తో మెప్పించింది.

GNXwdK3WsAAFFTd.jpeg

స్వ‌త‌హ‌గా క‌ర్ణాట‌కు చెందిన ఈ న‌టి రోబో ఫ్యామిలీ అనే క‌న్న‌డ‌ సీరియ‌ల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి వ‌రుస‌గా చాలా సీరియ‌ల్స్‌ల‌లో న‌టించి ఎన‌లేని గుర్తింపును తెచ్చుకుంది. త‌ర్వాత నిన్నే పెళ్లాడ‌తా అనే సీరియ‌ల్ ద్వారా తెలుగు నాట అడుగుపెట్టి ఇక్క‌డా మంచి అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటోంది. చిన్న‌త‌నంలోనే పెళ్లి చేసుకున్న ప‌విత్ర ఆ త‌ర్వాత భ‌ర్త‌కు దూరంగా ఉంటుంది. కాగా ఆమెకు కుమారుడు (22) కూతురు (19) ఉన్నారు.


అయితే షూటింగ్ నిమిత్తం ప‌విత్ర (Pavithra Jayaram) ఈ రోజు (ఆదివారం) ఉద‌యం బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తుండ‌గా క‌ర్నూలు హైవేపై మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని శేరిపల్లి గ్రామం వ‌ద్ద వ‌న‌ప‌ర్తికి వెళ్తున్న బ‌స్సును ఢీ కొట్ట‌డంతో అమె అక్క‌డిక్క‌డే మృతి చెందింది. ఆ స‌మ‌యంలో కారులో అమెతో పాటు ఉన్న డ్రైవ‌ర్‌, మ‌రో ఇద్ద‌రికి తీవ్రంగా గాయ‌ల‌వ‌గా స్థానికులు గ‌మ‌నించి వెంట‌నే స‌మీపంలోని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

2b09a171fb6ef1b0f0055872c088766f.jpg

ఇదిలాఉండ‌గా న‌టి ప‌విత్ర (Pavithra Jayaram) మృతితో క‌న్న‌డ‌, తెలుగు టీవీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాధ చాయ‌లు అలుముకున్నాయి. తోటి న‌టులు అమె మృతికి సంతాపం తెలుపుతూ ప‌విత్ర‌తో త‌మకు ఉన్న‌ జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటున్నారు.

Updated Date - May 12 , 2024 | 04:21 PM