మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Vishwa Prasad: సమయం కోసం ఎదురుచూస్తున్నాం! 

ABN, Publish Date - Feb 04 , 2024 | 04:46 PM

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan)- త్రివిక్రమ్‌లది(Trivikram) హిట్‌ కాంబినేషణ్‌. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’ హ్యాట్రిక్‌ విజయం అందుకోవాలనుకున్నారు. అది పరాజయం పాలైంది.

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan)- త్రివిక్రమ్‌లది(Trivikram) హిట్‌ కాంబినేషణ్‌. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’ హ్యాట్రిక్‌ విజయం అందుకోవాలనుకున్నారు. అది పరాజయం పాలైంది. దాని తర్వాత ఇద్దరూ కలిసి పూర్తి స్థాయిలో సినిమా చేయలేదు. వీరిద్దరి కాంబినేషణ్‌లో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వప్రసాద్‌ (TG Vishwa Prasad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘మేము నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమయంలోనే త్రివిక్రమ్‌ - పవన్‌కల్యాణ్‌ కాంబోలో సినిమా చేయాలని ప్లాన్  చేశాం. వాళ్లిద్దరూ ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే అప్పుడు పట్టాలెక్కిస్తాం’’ అని అన్నారు.

రవితేజ హీరోగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన ‘ఈగల్‌’ (Eagle) విడుదలకు సిద్థంగా ఉంది. ఈ చిత్రానికి కార్తిక్‌ ఘట్టమనేని దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌ చిత్రాల గురించి హింట్‌ ఇచ్చారు. ప్రభాస్‌ హీరోగా ‘రాజాసాబ్‌’ను సరైన సమయంలోనే విడుదల చేస్తామన్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ ఏడాది దాదాపు 15 చిత్రాలు విడుదల కానున్నాయని చెప్పారు. ఇప్పటికి ఆరు చిత్రాల షూటింగ్‌ పూర్తయిందని అన్నారు.  ‘ఓజీ’ని టేకోవర్‌ చేస్తున్నామంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలోనే తెరకెక్కుతోందని చెప్పారు. 


Updated Date - Feb 04 , 2024 | 06:15 PM