SSMB29: జపాన్ వేదికగా రాజమౌళి ఏం చెప్పారంటే.!

ABN , Publish Date - Mar 19 , 2024 | 10:31 AM

మహేశ్‌ బాబు -  రాజమౌళి కాంబినేషన్లో  'ఎస్‌ఎస్‌ఎంబీ29' తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! త్వరలోనే  సెట్స్  మీదకెళ్లనున్న ఈ చిత్రం గురించి రాజమౌళి ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు.

SSMB29: జపాన్ వేదికగా రాజమౌళి ఏం చెప్పారంటే.!

మహేశ్‌ బాబు (Maheshbabu)-  రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో  'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! త్వరలోనే  సెట్స్  మీదకెళ్లనున్న ఈ చిత్రం గురించి రాజమౌళి ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం జపాన్ లో జరుగుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్క్రీనింగ్ కోసం రాజమౌళి అక్కడికి వెళ్లారు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని చూపించారు అక్కడి ప్రజలు. ఆ వేదికగా రాజమౌళి మహేష్‌ సినిమా గురించి అప్‌డేట్‌ ఇచ్చారు.


‘మహేశ్‌ బాబుతో చేయబోతున్న సినిమా  స్క్రిప్ట్ వర్క్  పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. హీరోని మాత్రమే లాక్‌ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్‌ బాబు.  చాలా గ్లామర్‌గా ఉంటారు. మీలో చాలా మందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్‌ చేస్తాం. ఆ సమయంలో మహేశ్‌ బాబుని కూడా ఇక్కడికి తీసుకొస్తాను’’ అని రాజమౌళి అన్నారు. రాజమౌళి మాటల్ని సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్  విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. 

Updated Date - Mar 19 , 2024 | 10:31 AM