SSMB29- Viral Tweet: జపాన్  మాత్రమే కాదు.. ప్రపంచమంతా ఆ ప్రభావం ఉంటుంది!

ABN , Publish Date - Mar 21 , 2024 | 06:30 PM

మహేష్‌బాబు (mahesh babu) హీరోగా రాజమౌళి (Rajamouli) కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి  తెలిసిందే.  'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (SSMB29) వర్కింగ్‌ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.

SSMB29- Viral Tweet: జపాన్  మాత్రమే కాదు.. ప్రపంచమంతా ఆ ప్రభావం ఉంటుంది!


మహేష్‌బాబు (mahesh babu) హీరోగా రాజమౌళి (Rajamouli) కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి  తెలిసిందే.  'ఎస్‌ఎస్‌ఎంబీ 29' (SSMB29) వర్కింగ్‌ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఎస్‌ఎస్‌ కార్తికేయ చేసిన ట్వీట్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్పెషల్‌  స్క్రీనింగ్  కోసం రాజమౌళి కుటుంబ సమేతంగా జపాన్‌ వెళ్లారు. అక్కడ ప్రేక్షకులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. వారు బస చేసిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని తెలుపుతూ కార్తికేయ పోస్ట్‌ పెట్టారు. దీనికి ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘మహేశ్‌తో రాజమౌళి తీయనున్న సినిమా ట్రెలర్‌ ప్రభావం జపాన్‌లో ఎలా ఉంటుందో రిహార్సిల్స్‌ చేస్తున్నారా?’ అని ప్రశ్నించారు. దీనికి కార్తికేయ రిప్లై ఇస్తూ.. ‘ఆ సినిమా ప్రభావం జపాన్ లోనే కాదు ప్రపంచం మొత్తం ఉంటుంది’ అన్నారు. దీనిపై సినీ ప్రియులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘త్వరగా అప్‌డేట్‌ ఇవ్వండి’, ‘ఫస్ట్‌ లుక్‌ వదలండి’ అంటూ కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు నెగటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

రచయిత విజయేంద్ర ప్రసాద్‌  స్క్రిప్ట్  వర్క్‌ పూర్తి చేసి రాజమౌళికి అందజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు మహేశ్‌బాబు కూడా ఈ సినిమా కోసం సిద్థమవుతున్నారు. అయితే ఈ చిత్రం గురించి నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటి దాకా ఎటువంటి అప్‌డేట్‌ రాలేదు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటీనటులు నటించే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Mar 21 , 2024 | 06:34 PM