మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kishore Reddy: శ్రీకారం దర్శకుడు ఓ ఇంటివాడయ్యాడు!

ABN, Publish Date - Mar 01 , 2024 | 09:58 AM

టాలీవుడ్‌ దర్శకుడు కిషోర్‌ రెడ్డి (Kishore Reddy) ఓ ఇంటివాడయ్యారు. తెలుగు యాంకర్‌ కృష్ణ చైతన్యను (Anchor Krishna Chaitanya) ఆయన వివాహం చేసుకున్నారు.

టాలీవుడ్‌ దర్శకుడు కిషోర్‌ రెడ్డి (Kishore Reddy) ఓ ఇంటివాడయ్యారు. తెలుగు యాంకర్‌ కృష్ణ చైతన్యను (Anchor Krishna Chaitanya) ఆయన వివాహం చేసుకున్నారు. శర్వానంద్‌ హీరోగా శ్రీకారం (Sreekaram)సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కిశోర్‌ తెలుగులో  ‘లవ్‌.కామ్‌', 'లక్ష్మీరావే మా ఇంటికి’ వంటి చిత్రాలతో పాటు కన్నడంలో ఓ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన 'శ్రీకారం' సినిమా తనకు మంచి విజయంతో పాటు గౌరవం కూడా తీసుకొచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున మూడుగంటల సమయంలో హైదరాబాద్‌ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో యాంకర్‌ కృష్ణ చైతన్యను కిశోర్‌ రెడ్డి వివాహం చేసుకున్నారు.  

యాంకర్‌ కేసీగా  కృష్ణ చైతన్య  అందరికీ సుపరిచితమైనదే. గతంలో రేడియో జాకీగా పనిచేశారు. ఆర్జే స్మైలీ క్వీన్‌ పేరుతో ఆమె రేడియో జాకీగా వ్యవహరించేవారు. పలు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో పాటు సినిమా ఈవెంట్‌లకు కూడా ఆమె యాంకర్‌గా వ్యవహరిస్తుంది.

Updated Date - Mar 01 , 2024 | 10:00 AM