Chiranjeevi: అభిమానంతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు! 

ABN , Publish Date - Feb 04 , 2024 | 07:25 PM

కన్నడు నటుడు శివ రాజ్‌కుమార్‌ (ShivaRajkumar) మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ఇంట సందడి చేశారు. చిరుపై  ఉన్న అభిమానాన్ని ప్రత్యక్షంగా చాటుకున్నాడు. కేంద్రం చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటిం

Chiranjeevi: అభిమానంతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు! 

కన్నడు నటుడు శివ రాజ్‌కుమార్‌ (ShivaRajkumar) మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ఇంట సందడి చేశారు. చిరుపై  ఉన్న అభిమానాన్ని ప్రత్యక్షంగా చాటుకున్నాడు. కేంద్రం చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో కంగ్రాట్స్‌ చెప్పేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. చిరుకి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. సంబంధిత ఫొటోలను చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు చిరు. 

Siva.jfif

‘‘డియర్‌ శివ రాజ్‌కుమార్‌.. నన్ను అభినందించేందుకు మీరు బెంగళూరు నుంచి రావడం హృదయాన్ని హత్తుకుంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయనతో కలిసి భోజనం చేయడం, లెజండరీ నటుడు రాజ్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత శివరాజ్‌కుమార్‌కు స్వయంగా భోజనం వడ్డిస్తున్నారు.అలాగే ఆ ఫోటోల బ్యాగ్రౌండ్‌లో ఉన్న మరో ఫోటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 


Updated Date - Feb 04 , 2024 | 07:31 PM