Varun Tej: మరో కథో రెడీ.. కాంబో సెట్‌ అయినట్లేనా?

ABN , Publish Date - May 24 , 2024 | 07:54 PM

మెగా ప్రిన్స్  వరుణ్‌ తేజ్‌ (varun Tej) కెరీర్‌ను టర్న్‌ చేసిన చిత్రం 'ఫిదా' (Fidaa). శేఖర్‌ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలవడమే కాక కలెక్షన్ల వర్షం కురిపించింది.

Varun Tej:  మరో కథో రెడీ.. కాంబో సెట్‌ అయినట్లేనా?

మెగా ప్రిన్స్  వరుణ్‌ తేజ్‌ (varun Tej) కెరీర్‌ను టర్న్‌ చేసిన చిత్రం 'ఫిదా' (Fidaa). శేఖర్‌ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలవడమే కాక కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే వీరిద్దరి కాంబోలో  మరో చిత్రం రావాలని అభిమానులు చాలాకాలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు శేఖర్‌ కమ్ముల, వరుణ్‌ మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ఏ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని టాక్‌. వరుణ్‌ ప్రస్తుతం ‘మట్కా’ చిత్రంతో బిజీగా ఉన్నారు.  శేఖర్‌ కమ్ముల ‘కుబేర’తో బిజీగా ఉన్నారు. అవి రెండూ పూర్తయ్యాకే ఈ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతోందని సమాచారం.



‘ఫిదా’ తరవాత శేఖర్‌ కమ్ముల బాగా గ్యాప్‌ తీసుకొన్నారు. ఆ గ్యాప్‌లోనే కొన్ని కథలు తయారు చేశారు. అందులో ఓ కథ ‘కుబేర’. మరో కథ వరుణ్‌కి సెట్‌ అవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్‌ని వరుణ్‌ దగ్గరకు తీసుకెళ్లారు. వరుణ్‌ కూడా శేఖర్‌ కమ్ములతో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్యన వరుణ్‌ చేసిన సినిమా ఏదీ సరైన ఫలితం ఇవ్వలేదు.  వరుసగా ఫ్లాప్స్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘మట్కా’పైనే ఆశలు పెట్టుకొన్నాడు. శేఖర్‌ కమ్ముల కథ కూడా కొత్త జోనర్‌లో సాగబోతోందని తెలుస్తోంది.


Updated Date - May 24 , 2024 | 07:54 PM