Samantha: సరైన మార్గంలో నడిపించే వ్యక్తి కోసం వెతుకుతాం

ABN , Publish Date - Jun 11 , 2024 | 08:08 PM

ఖాళీ దొరికిన ప్రతిసారీ సమంత (Samantha) టూర్స్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. మయోసైటీస్‌తో బాధపడుతున్నప్పటి నుంచి టూర్స్‌ తగ్గించి ఆ సమయాన్ని ధ్యానం కోసం కేటాయిస్తున్నారు.

Samantha: సరైన మార్గంలో నడిపించే వ్యక్తి కోసం వెతుకుతాం

ఖాళీ దొరికిన ప్రతిసారీ సమంత (Samantha) టూర్స్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. మయోసైటీస్‌తో బాధపడుతున్నప్పటి నుంచి టూర్స్‌ తగ్గించి ఆ సమయాన్ని ధ్యానం కోసం కేటాయిస్తున్నారు. కొంతకాలంగా ఆమె కోయంబత్తూరులోని ఈషా (Isha Foundation) ఫౌండేషన్‌కు వెళ్లి అక్కడ ధ్యానం చేస్తున్నారు. గత శివరాత్రికి ఆమె అక్కడే ఉన్నారు. ఆ ఫొటోలను తాజాగా మరోసారి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘గురువు, మెంటార్‌ కోసం మనలో చాలామంది వెతుకుతుంటారు. మన జీవితంలో వెలుగులు నింపి.. మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనుగొనడానికి మించిన ప్రత్యేకమైనది మరొకటి ఉండదు. జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో అనేక సంఘటనలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. వాటిలో ఏవి సాధారణం, ఏది అసాధారణం అన్నది తెలుసుకోవడం కష్టం. అలాంటి వాటి గురించి కేవలం తెలుసుకోవడమే కాదు.. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయడం కూడా ముఖ్యమే’ అని పేర్కొన్నారు.

sam 2.jpeg
ఖుషి చిత్రం తర్వాత సమంత మరో సినిమా చేయలేదు. బాలీవుడ్‌లో నటించి సిటాడెల్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధమైంది. కొంత విరామం తర్వాత ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ఆమె ప్రకటించారు.. దీనికి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’పై రూపొందుతున్న మొదటి చిత్రమిది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియచేస్తామని సామ్‌ ఓ సందర్భంలో చెప్పారు. 

sam 3.jpeg

Updated Date - Jun 11 , 2024 | 08:08 PM