Renu Desai: ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను!

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:15 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌ అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి అకీరా తన తండ్రి పవన్  కల్యాణ్‌తోనే ఉంటున్నారు. అతడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు.

Renu Desai:  ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్‌ కల్యాణ్‌ (MLA pawan kalyan) అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి అకీరా (Akhira) తన తండ్రి పవన్  కల్యాణ్‌తోనే ఉంటున్నారు. అతడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఎన్డీయే (NDA)సమావేశానికి హాజరైన పవన్ తన కుమారుడిని కూడా ఢిల్లీ తీసుకెళ్లారు. మోదీకి అకీరాను పరిచయం చేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే!  దీనిపై రేణు దేశాయ్‌ (Renu desayi) భావోద్వేగంగా ఓ పోస్ట్‌ చేశారు. ‘నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం. మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, భావోద్వేగంగా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోదీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్‌ చేసి తన అనుభూతి పంచుకున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. తన చుట్టూ ఓ పాజిటివ్‌ వైబ్‌ ఉందని చెప్పాడు’ అని రేణుదేశాయి ఇన్స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.


Pk.jpg

తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి పవన్‌ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. తన కుమారుడు అకీరాను సైతం ఢిల్లీకి తీసుకెళ్లారు. నేతల భేటీ అనంతరం మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.  

Updated Date - Jun 07 , 2024 | 05:11 PM