Rashmi Gautam - Guntur Kaaram: అప్రోచ్ అయితే కదా.. అదో.. ఇదో జరిగేది!

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:44 PM

మహేశ్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ చిత్రంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు ఫస్ట్‌ ఛాయిస్‌ రష్మి గౌతమ్‌ అని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

Rashmi Gautam - Guntur Kaaram: అప్రోచ్ అయితే కదా.. అదో.. ఇదో జరిగేది!

మహేశ్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ చిత్రంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు ఫస్ట్‌ ఛాయిస్‌ రష్మి గౌతమ్‌ అని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. పలు వెబ్‌సైట్స్‌, సోషల్‌ మీడియాలో కుర్చీ మడతపెట్టి సాంగ్‌ కోసం పూర్ణ కన్నా ముందు రష్మీ గౌతమ్‌ను  అప్రోచ్  అయ్యారని, ఆమె తిరస్కరించడంతో పూర్ణకు ఆ అవకాశం దక్కిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రష్మి ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్పందించారు. గుంటూరు కారం టీమ్‌ అసలు తనను సంప్రదించలేదన్నారు. "అసలు నన్ను అప్రోచ్ అయితే కదా అంగీకరించేది, తిరస్కరించేది తెలిసేది.  ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ నాపైౖ నెగిటివిటీని తీసుకొచ్చే అవకాశముంది. దయచేసి వాటిని ప్రోత్సహించవద్దు’ అని విజ్ఞప్తి చేశారు రష్మి. ఆ పాటలో నటించి, అలరించిన  పూర్ణను ప్రశంసించారు. ఆమె తప్ప ఇంకెవరూ అంత బాగా చేయలేరని కితాబిచ్చారు. ప్రస్తుతం రష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

guntur-1.jpg

ఈ పాటలో ‘రాజమండ్రి రాగ మంజరి.. మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రి , ఏం రసిక రాజువో మరి’ లైన్స్‌కు పూర్ణ, మిగిలిన పోర్షన్‌కు మహేశ్‌బాబు- శ్రీలీల ఆడి అలరించారు.  'అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రమిది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవల ‘నెట్‌ఫ్లిక్స్‌’ ఓటీటీలోకి వచ్చింది.

Updated Date - Feb 13 , 2024 | 04:44 PM