Ramoji Rao Final journey: ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు పూర్తి!

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:16 PM

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramojirao) అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతి వనంలో అంత్యక్రియలు నిర్వహించారు

Ramoji Rao Final journey: ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు పూర్తి!

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramojirao) అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతి వనంలో అంత్యక్రియలు నిర్వహించారు. రామోజీరావు కుమారుడు కిరణ్‌ (Ch kiran) అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామోజీరావుకి (Ramojirao Final journey) కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు రామోజీరావు పాడెను మోశారు. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.  వి.హనుమంతరావు,  నారా లోకేశ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నామా నాగేశ్వరరావు,  కేఆర్‌ సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వెనిగండ్ల రాము బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. 

Updated Date - Jun 09 , 2024 | 12:16 PM