Ram Charan: వేల్స్‌ యూనివర్సిటీ నుంచి రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌..

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:09 PM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కీర్తి కిరీటంలో మరో డైమండ్‌ చేరింది. చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించింది. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్‌ ఇవ్వటంలో వేల్స్‌ యూనివర్సిటీ ప్రసిద్థి చెందింది.

Ram Charan: వేల్స్‌ యూనివర్సిటీ నుంచి రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌..
Ram Charan

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan)కీర్తి కిరీటంలో మరో డైమండ్‌ చేరింది. చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ (Vels University Tamilnadu)ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను (Dr Ramcharan) అందించింది. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్‌ ఇవ్వటంలో వేల్స్‌ యూనివర్సిటీ ప్రసిద్థి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రామ్‌ చరణ్‌ చేసిన సేవలకు వేల్స్‌ యూనిర్సిటీ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించింది. (Global Star)

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ...

‘‘నాపై ఇంత ప్రేమాబిమానాలు చూపించి గౌరవంతో డాక్టరేట్‌ బహుకరించిన వేల్స్‌ యూనివర్సిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 38 సంవత్సరాలకు పైగా ఈ యూనివర్సిటీని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీ నుంచి నాకు గౌరవ డాక్టరేట్‌ ఇస్తున్నారనే విషయం తెలియగానే మా అమ్మ నమ్మలేదు. ఆర్మీలాంటి గ్రాడ్యుయేషన్స్‌ మధ్య నేను ఈరోజు ఇలా ఉండటం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి నాకు దక్కిన గౌరవం నాది కాదు.. నా అభిమానులది. దర్శకులు, నిర్మాతలు, నా తోటి నటీనటులది. వేల్స్‌ యూనివర్సిటీని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజమాన్యానికి, టీచింగ్‌ సిబ్బందికి, విద్యార్థులకు నా అభినందనలు’’ అని అన్నారు.  

Chranan.jpg

కలలను సాకారం చేసే భూమి ఇది..
ఇంకా ఆయన చెబుతూ " నేను  చెన్నై  విజయ హాస్పిటల్‌లోనే పుట్టి పెరిగాను . ఈ ప్రాంతం నాకెంతో ఇచ్చింది. నాకే కాదు, మా నాన్నగారు తన ప్రయాణాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. నా సతీమణి ఉపాసన వాళ్లు  అపోలో హాస్పిటల్స్‌ను కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టారు. తెలుగు ఇండస్ట్రీలో ఎనబై శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలని కలలు కని చెన్నైకి వస్తే అది తప్పక నెరవేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్పతనం. అన్ని రంగాల వారికి ఈ భూమి కలలను  నేరవేర్చేదిగా ఉంటూ వస్తుంది’’ అన్నారు.

charan.jpeg

గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై క్లారిటీ
ఇక నా సినిమాల విషయానికొస్తే దర్శకుడు శంకర్‌గారితో ుగేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నాను. ఆయనతో వర్క్‌ చేయాలని చాలా మంది అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయనతో వర్క్‌ చేయటం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఆయన ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. డిఫరెంట్‌ స్టోరీతో ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతుంది. ఐదు భాషల్లో పాన ఇండియా మూవీగా సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాం’’ అన్నారు రామ్‌చరణ్‌. 

Vidya Balan: అందుకే కొందరు నాతో సినిమాలు చేయరు!


Updated Date - Apr 13 , 2024 | 08:18 PM