Puri Musings: ప్రశాంతంగా ఉండండి.. పక్కవారిని కూడా అలాగే ఉండనివ్వండి!

ABN , Publish Date - Apr 26 , 2024 | 09:36 PM

పూరి మ్యూజింగ్స్‌ ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూరి జగన్నాథ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో చెప్పే మ్యూజింగ్‌ వీడియోస్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. తాజాగా ఆయన భూమి పై శాంతి అనే అంశంతో ఒక వీడియోను పంచుకున్నారు.

Puri Musings: ప్రశాంతంగా ఉండండి.. పక్కవారిని కూడా అలాగే ఉండనివ్వండి!

పూరి మ్యూజింగ్స్‌ (Puri Musings) ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూరి జగన్నాథ్‌ (puri Jagannath) తన యూట్యూబ్‌ ఛానల్‌లో చెప్పే మ్యూజింగ్‌ వీడియోస్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. తాజాగా ఆయన భూమి పై శాంతి అనే అంశంతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఏం చెప్పారంటే.. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయుధాల ఉత్పత్తిని నిలిపేయాలని, న్యూక్లియర్‌ బాంబులు తయారుచేయడం ఆపేయాలని 1965లోనే ఒక మత పద్ద తన స్పీచ్‌లో కోరారు. అప్పట్లో ఆయన స్పీచ్‌ బాగా వైరల్‌ అయింది. 1985లో జిడ్డు కృష్ణమూర్తి ఇదే టాపిక్‌పై మాట్లాడారు. ఎన్నో వేల ఏళ్ల నుంచి శాంతి గురించి అన్ని మతాలు మాట్లాడాయి. కానీ, ఇప్పటివరకు జరిగిన ప్రతీ యుద్ధం మతాల వల్లే జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మనిషి కూడా ఎప్పుడూ సంఘర్షణలోనే జీవిస్తున్నాడు. పక్కింటి వాళ్లతో, కుటుంబంతో, సమాజంతో.. ఆఖరికి తనతో తానే ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. మళ్లీ అదే మనిషి తన కుటుంబం, తన భాష, దేశం కోసం యుద్ధాలు చేస్తాడు. ‘దేశాల మధ్య, రెండు గ్రూపుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. యుద్థం లేకుండా మనకు శాంతి లేదు. వాటిని ఆపాలంటే ముందు  మన మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను ఆపేయాలి. ఒకరిని ఒకరు అసహ్యించుకోవడం తగ్గించాలి. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ కారణంగా ఒక తరం తర్వాత ఆ ఊరు రెండు ముక్కలు అవ్వొచ్చు. ఇంకో తరం తర్వాత రెండు జాతులుగా మారొచ్చు. ఇలా తరతరాలు పెరిగి అది ప్రపంచ యుద్ధానికి కూడా కారణం కావొచ్చు. ఒక చిన్న తగాదా వైరస్‌లా వ్యాపించి వెయ్యేళ్లు కొనసాగుతుంది. అందుకే దేన్నైనా ఆపాలి అనుకుంటే.. రప్రారంభంలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. అలా ఆపగలిగితేనే భవిష్యత్తు బాగుంటుంది. మన మతాన్ని ప్రేమించడంతో పాటు ఎదుటి వాళ్ల మతాన్ని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ‘బాగున్నారా.. పిల్లలు ఎలా ఉన్నారు’ అని గౌరవంగా పలకరిేస్త.. మీరు ఒక యుద్థాన్ని ఆపినట్లే. అలా కాకుండా పక్కవారితో అసభ్యంగా  పరుషంగా ఒక్కమాట మాట్లాడినా.. అది ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేం. ఏదో ఒకరోజు ఆ మాటే యుద్థంగా మారుతుంది. 2050లో జరగబోయే ప్రపంచయుద్థానికి కారణం కూడా ఆ మాటే అని ఇప్పుడు ఎవరికీ తెలీదు. ఆటంబాంబులు తయారుచేయడం వల యుద్థాలు రావు.. వాటిని ఆపేయడం వల్ల ఆగవు. ఆటంబాంబులు వంటి ఆలోచనలు వల్ల వస్తాయి. దయచేసి ప్రశాంతంగా ఉండండి.. పక్కవారిని కూడా అలాగే ఉండనివ్వండి’ అని పూరి జగన్నాథ్‌ మ్యూజింగ్‌ ద్వారా కోరారు’.

Updated Date - Apr 26 , 2024 | 09:36 PM