SSMB29: రాజ‌మౌళి, మ‌హేశ్ సినిమా.. ఆ న్యూస్ ఫేక్‌! నిర్మాత క్లారిటీ

ABN , Publish Date - May 17 , 2024 | 09:00 AM

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్‌ మ‌హేశ్‌బాబు కాంబినేష‌న్‌లో SSMB29 చిత్రం తెర‌కెక్కనున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా విష‌యంలో ఇటీవ‌ల జ‌రుగుతున్న ఓ వార్త విష‌యంలో చిత్ర నిర్మాత కేఎల్ నారాయ‌ణ క్లారిటీ ఇచ్చారు.

SSMB29: రాజ‌మౌళి, మ‌హేశ్ సినిమా.. ఆ న్యూస్ ఫేక్‌! నిర్మాత క్లారిటీ
ssmb29

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి (SS Rajamouli), సూప‌ర్ స్టార్‌ మ‌హేశ్‌బాబు (Mahesh Babu) కాంబినేష‌న్‌లో ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29)వ‌ చిత్రం తెర‌కెక్కనున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన న‌టుల సెల‌క్ష‌న్స్‌, లోకేష‌న్స్‌ ఎంపిక‌లో బిజీగా ఉన్నారు. అంతేగాక మ‌హేశ్‌బాబు లుక్ కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. అయితే ఈ క్ర‌మంలో ఈ సినిమా విష‌యంలో ఇటీవ‌ల జ‌రుగుతున్న ఓ వార్త విష‌యంలో చిత్ర నిర్మాత కేఎల్ నారాయ‌ణ (K.L. Narayana) క్లారిటీ ఇచ్చారు.

GNv6nJUXgAAEEUx.jpeg

విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ‌ ఆంగ్ల వార్తా ప‌త్రిక రాజ‌మౌళి (SS Rajamouli) , మ‌హేశ్ బాబు (Mahesh Babu) క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమాకు గ‌తంలో అప‌రిచితుడు, 1 నేనొక్క‌డినే చిత్రాల‌కు ప‌ని చేసిన‌ ప్ర‌ముఖ క్యాస్టింగ్ డైరెక్ట‌ర్ వీరెన్ స్వామి(Viren Swami)ని తీసుకున్న‌ట్లు ప్ర‌చురించారు. దీంతో ఈ వార్త సోష‌ల్‌మీడియాలో బాగా వైర‌ల్ అయింది. ఈ న్యూస్‌ కాస్త సినిమా మేక‌ర్స్ వ‌ద్ద‌కు చేర‌డంతో ఇప్పుడు ఈ విష‌య‌మై దుర్గా ఆర్ట్స్ నిర్మాత నారాయ‌ణ (K.L. Narayana) స్పందించారు.


110104943.webp

'ఎస్‌ఎస్‌ఎంబీ 29స సినిమాకు సంబంధించి ఇంత‌వ‌ర‌కు ఎవ‌రినీ తీసుకోలేద‌ని, ప్ర‌స్తుతం ఫ్రీ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నామ‌న్నారు. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు. అప్ప‌టివ‌ర‌కు సినిమా గురించి అస‌త్య ప్ర‌చారాలు చేయొద్ద‌ని క‌రుతూ ప్రెస్‌నోట్ విడుద‌ల చేశారు.

Updated Date - May 17 , 2024 | 10:23 AM