మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan OG: ‘గంభీరా ప్రామిస్.. ఇద్దరిలో ఒక తలే మిగులుద్ది’! అదిరిన ఓజీ అప్డేట్‌

ABN, Publish Date - Mar 25 , 2024 | 06:12 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాహో దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఓజీ. ఆదివారం నటుడు ఇమ్రాన్ హస్మీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపుతూ చిత్ర యనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేయగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

og

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , సాహో దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఓజీ (TheyCallHimOG). షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27 న విడుదల చేయనున్నట్లు ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రియాంక మోహన్ (Priyanka mohan ) కథానాయికగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మీ (Emraan Hashmi) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆదివారం నటుడు ఇమ్రాన్ హస్మీ (Emraan Hashmi) జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపుతూ చిత్ర యనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేయగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ పోస్టును ఇమ్రాన్ షేర్ చేస్తూ ‘ గంభీరా నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా ప్రామిస్ ఇద్దరిలో ఒక తలే మిగులుద్ది’ అంటూ సాగే డైలాగ్ ను కోట్ చేశారు. దానిని తెలుగు, హిందీలలోనూ పోస్టు చేయగా నెట్టింట హల్చల్ చేస్తోంది.


RRR వంటి భారీ చిత్రం తర్వాత డీవీవీ దానయ్య (DVV Entertainment) ఈ చిత్నాన్ని నిర్మిస్తుండగా.. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. గ్యాంగ్‌స్ట‌ర్, యాక్షన్ జానర్ లో సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ ఓజీ (OG Movie) సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్,ఫస్ట్ లుక్ అన్నీ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం ఏపీ ఎన్నిలకల నేపథ్యంలో షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇవ్వగా మేలో తిరిగి షూట్ స్టార్ట్ చేయనున్నారు.

Updated Date - Mar 25 , 2024 | 06:12 AM