Sree Vishnu: ముగ్గురూ కలిసిన వేళ.. నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌!

ABN , Publish Date - Feb 22 , 2024 | 01:29 PM

యంగ్‌ హీరో, కథల విషయంలో ఆచితూచి అడుగేసే శ్రీవిష్ణు (Sri Vishnu) సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. గత సంవత్సరం 'సామజవరగమన' చిత్రంతో విజయం అందుకున్న ఆయన మరో హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు.

Sree Vishnu: ముగ్గురూ కలిసిన వేళ.. నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌!


యంగ్‌ హీరో, కథల విషయంలో ఆచితూచి అడుగేసే శ్రీవిష్ణు (Sri Vishnu) సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. గత సంవత్సరం 'సామజవరగమన' చిత్రంతో విజయం అందుకున్న ఆయన మరో హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. 'బోచేవారెవరురా’ చిత్రం తర్వాత శ్రీవిష్ణు(Sree Vishnu), ప్రియదర్శి(Priya darshi), రాహుల్‌ రామకృష్ణ(Rahul rama krishna) మరోసారి కలిసి నటించడం విశేషం. ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో యు.వి. క్రియేషన్స్  బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందుతోంది. హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాకు 'ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush) అనే ఆసక్తికర టైటిల్‌ ఖరారు చేశారు. 'నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌’ (No Logic Only Magic) అనే క్యాప్షన్‌ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఓం భీమ్‌ బుష్‌ పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్‌ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. బ్రోచేవారెవరురా సినిమాతో హిట్‌  కొట్టిన ఈ ముగ్గురు మరోసారి నవ్వించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Updated Date - Feb 22 , 2024 | 01:29 PM