Niharika Konidela: నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’.. కొత్తగా 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్
ABN , Publish Date - May 01 , 2024 | 10:04 PM
నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. పక్కా ప్లానింగ్తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్ను పూర్తి చేశారు.
![Niharika Konidela: నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’.. కొత్తగా 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్](https://media.chitrajyothy.com/media/2024/20240428/cc_6190434f7b.jpg)
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ (Shree Radha Damodar Studios) బ్యానర్స్పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’(Committee Kurrollu). యదు వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పక్కా ప్లానింగ్తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్ను పూర్తి చేయటం విశేషం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఈ సందర్భంగా.. నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela ) మాట్లాడుతూ ‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu). శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. న్యూ టాలెంట్ను ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ఎక్కువ మంది కొత్త వాళ్లతోనే సినిమాను పూర్తి చేశాం. యదు వంశీగారు మంచి ప్లానింగ్తో సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేయటం విశేషం. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం’ అన్నారు.
చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘దర్శకుడిగా నా తొలి సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ అందించిన సపోర్ట్తో సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ని పరిచయం చేస్తున్నాం’ అన్నారు.
శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ (Shree Radha Damodar Studios) ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ ‘మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది. కమిటీ కుర్రోళ్ళు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్ సహా ఇతర వివరాలను తెలియజేస్తాం’ అన్నారు.