Naga Vamsi: 12న సొంతూళ్లకు వెళ్లండి.. 13న ఓటేయండి!

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:41 PM

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజురోజుకు  హీటెక్కుతుంది. టీడీపీ, జనసేన (Janasena), బీజేపీ కూటమికి మద్దతు పెరుగుతుంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా సైలెంట్‌ సపోర్ట్‌ అందుతోంది. ఇండస్ట్రీలో పవన్‌కు (Pawan kalyan) చాలామంది అభిమానులు ఉన్నారు.

Naga Vamsi: 12న సొంతూళ్లకు వెళ్లండి.. 13న ఓటేయండి!


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజురోజుకు  హీటెక్కుతుంది. టీడీపీ, జనసేన (Janasena), బీజేపీ కూటమికి మద్దతు పెరుగుతుంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా సైలెంట్‌ సపోర్ట్‌ అందుతోంది. ఇండస్ట్రీలో పవన్‌కు (Pawan kalyan) చాలామంది అభిమానులు ఉన్నారు. దర్శకనిర్మాతలు ఎందరో ఆయనకు సన్నిహితులు. అందులో సితారా ఎంటర్‌టైనమెంట్‌ సంస్థ ఒకటి. ఆ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ (Nagavamsi) పవన్ తో  సినిమాలు చేశారు. ఆయనకు  స్నేహితుడైన త్రివిక్రమ్‌ (Trivikram) ఆ సంస్థకు బాగా కావలసిన మనిషి. దాంతో సితార సంస్థ మద్దతు పవన్ కు  తప్పకుండా ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగవంశీ మాట్లాడారు. పవన్‌కు తమ మద్దతు ఉంటుందని స్వయంగా తెలిపారు. మే 12వ తేదీకి పవన్  అభిమానులంతా ఏపీ చేరుకొని, 13న ఓటింగ్‌ లో పాల్గొనాలని కోరారు. అదే పవన్‌ కల్యాణ్‌కు అభిమానులు చేసే గొప్ప సేవ అని పేర్కొన్నారు. "ఆంధ్రాలో ఓటు హక్కు ఉన్న చాలామంది యువత హైదరాబాద్‌లో సెటిలైపోయారు. వాళ్లంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూర్లు వెళ్లాలి (Ap Elections). ఈ ఓటింగ్‌ శాతం గెలుపు, ఓటములపై తప్పకుండా ప్రభావం చూపుతుంది’’ అని నాగవంశీ అన్నారు .

అయితే నాగవంశీ ముక్కుసూటి మనిషి కాబట్టి డేర్‌గా వేదికపై పవనకు మద్దతు ప్రకటించారు. కొందరు దర్శకనిర్మాతలు బయటకు చెప్పకపోయినా ఇప్పటికే పవన్‌ వెనుక ఉన్నారు. ఆర్థికంగానూ తమ వెన్నుదన్ను అందిస్తున్నారు. పవన్‌ ప్రచారంలో అది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు నాగవంశీ మాటల్ని బట్టి, సితార కూడా పవన్‌ వెనుక ఉందన్న విషయం అర్థమైంది. 

Updated Date - Apr 28 , 2024 | 04:42 PM