Kalki: నాగ్ అశ్విన్ - స్వప్న దత్ సరదా సంభాషణ!

ABN , Publish Date - May 11 , 2024 | 02:11 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ . వైజయంతీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ , కమల్‌హాసన్  వంటి అగ్ర తారలు నటిస్తున్నారు.

Kalki: నాగ్ అశ్విన్ - స్వప్న దత్ సరదా సంభాషణ!

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) . వైజయంతీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ , కమల్‌హాసన్  వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. దీపికా పదుకొణె (Deepika padukone), దిశా పటాని నాయికలు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మరో పక్క అంతే వేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్  పనులు జరుగుతున్నాయి. ఈ చిత్ర నిర్మాత స్వప్నదత్‌ (Swapna dutt) సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సరదా పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా ‘కరెంట్‌ ఎఫైర్స్‌ ఆఫ్‌ వైజయంతి’ అంటూ నాగ్‌ అశ్విన్‌కు తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. 

నా సీజీ షాట్స్‌ ఎప్పుడు వస్తాయో?  
‘‘కల్కి’ సీజీ వర్క్‌ చేస్తున్న వారంతా ఓటు వేయడానికి హైదరాబాద్‌ నుంచి వాళ్ల ఊర్లకు వెళ్లారు ఇప్పుడెలా’ అని నాగ్‌ అశ్విన్‌ అనగా.. ‘ఎవరు గెలుస్తారేంటి’ అని స్వప్న అడిగారు. దానికి ఆయన సరదాగా బదులిస్తూ.. ‘ఎవరు గెలిస్తే నాకెందుకండీ.. నా సీజీ షాట్స్‌ ఎప్పుడు వస్తాయో అని నేను ఎదురుచూస్తున్నా’ అన్నారు.

vyjayanti.jpg

దీనిని బట్టి  ‘కల్కి’ గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇంకా పూర్తి కానట్లు అర్థమవుతోంది. మరోవైపు ఈ చిత్రాన్ని జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈలోగా వర్క్‌ అంతా పూర్తి చేయాలని నాగ్‌ అశ్విన టీమ్‌ కృషి చేస్తోంది.  భారీ బడ్జెట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భివిష్యత్తుతో ముడిపడిన కథ ఇదని, అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం’ అని పలు ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పారు.

Updated Date - May 11 , 2024 | 03:07 PM