Nag Ashwin: వారి దృష్టిలో పెట్టుకునే కల్కి తీశా!

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:45 PM

నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad). ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది

Nag Ashwin: వారి దృష్టిలో పెట్టుకునే కల్కి తీశా!

నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad). ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్‌ నేషనల్  మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. అగ్ర నటీనటులతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. "ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్స్‌ నటించారు. వాళ్లను డైరెక్ట్‌ చేయడం సామాన్యమైన విషయం కాదు. నేను డైరెక్షన్‌లోకి వచ్చి తక్కువ కాలమే అవుతుంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ వంటి వారు నాలుగు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. గొప్ప నటులు. వారికి సీన్స్‌ వివరించడం సిల్లీగా అనిపించింది. ఈ సినిమా కోసం తొలి సన్నివేశాన్ని అమితాబ్‌తో తీశాను. ఆయనకు ఇందులో మంచి యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకుంటూనే ఉంటారు. అది వాళ్ల గొప్పతనం. ప్రభాస్‌, దీపికాను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన వాళ్ల నుంచి ఏం కోరుకుంటున్నారో అలాగే ఈ సినిమా తీశా. 12 ఏళ్ల పిల్లలు కూడా ఇష్టపడేలా తెరకెక్కించాం. ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలను పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఇందులో ఎలాంటి వెహికల్స్‌ వాడాలి అనే విషయంపై ఎన్నో రోజులు ఆలోచించాను. మనుషులు మాస్క్‌లు పెట్టుకోవడం, ఆక్సిజన్‌ సిలిండర్లు ఉపయోగించడం వంటివి నిజంగా జరుగుతున్నవే’ అని అన్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా అని అడగగా  నాగ్‌ అశ్విన సమాధానం చెప్పకుండా జారుకున్నారు. 

Updated Date - Jun 15 , 2024 | 05:45 PM