Manchu Vishnu: మౌనంగా ఉండం.. ఇలాంటి దాడులను తట్టుకోము

ABN, Publish Date - Oct 03 , 2024 | 11:15 AM

తెలంగాణ మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున, నాగచైతన్య, సమంత పేర్లను ప్రస్తావించి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపాయి. తాజాగా 'మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.

తెలంగాణ మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను (ktr)విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) నాగార్జున, నాగచైతన్య, సమంత పేర్లను ప్రస్తావించి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపాయి. దీనిపై ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ నుంచి హేమ వరకూ స్పందిస్తూ వచ్చారు. తాజాగా 'మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu reaction) స్పందించారు. "సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యలు నేపథ్యంలో, వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నా. మన పరిశ్రమ, ఇతర రంగాల వలె, పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్‌ అవ్వడం, లేదా వారి వ్యక్తిగత జీవితాలను అబద్దపు ఆరోపణలలోకి లాగడం ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను  దయచేసి రాజకీయ కథనాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మా నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడకండి. చితపరిశ్రమలో పని చేసేవారంతా సమాజానికి వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నాము. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దు అని  మునస్పూర్తిగా కోరుకుంటున్నాను. మనమంతా ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాల పైన వచ్చే అబద్దపు కథనాల వలన కలిగే బాధ చాలా తీవ్రమైనది. ఇలాంటి సంఘటనలు మరింత  సమస్యలు, బాధను కలిగిస్తాయి. పరిశ్రమ తరపున, నేను మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్ర పరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండము. ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతాం’’ అని మంచు విష్ణు తన లేఖలో పేర్కొన్నారు.

Chiranjeevi: కొండా సురేఖ వ్యాఖ్యలు.. చిరంజీవి ఫైర్‌


మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Oct 03 , 2024 | 11:22 AM