Guntur Kaaram: ప్రపంచ సినిమా చరిత్రలో మొదటిసారి.. ఏంటది!

ABN , Publish Date - Jan 02 , 2024 | 03:55 PM

ప్రస్తుతం గుంటూరు కారం చిత్రానికి సంబంధించి ఏ విషయం అయినా నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది. పాటలు, ఆటలతోపాటు నిర్మాత నాగవంశీ మాటలు కూడా సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.. ఈ మధ్యకాలంలో ఆయన ఘాటైన మాటలే సినిమాను మరింత ప్రమోట్‌ చేశాయి.

Guntur Kaaram:  ప్రపంచ సినిమా చరిత్రలో మొదటిసారి.. ఏంటది!

ప్రస్తుతం 'గుంటూరు కారం' చిత్రానికి సంబంధించి ఏ విషయం అయినా నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది. పాటలు, ఆటలతోపాటు నిర్మాత నాగవంశీ మాటలు కూడా సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.. ఈ మధ్యకాలంలో ఆయన ఘాటైన మాటలే సినిమాను మరింత ప్రమోట్‌ చేశాయి. తాజాగా వచ్చిన 'కుర్చీ మడత పెట్టి’ పాటతో సినిమాపై మరింత క్రేజ్‌ పెరిగింది. తాజాగా మరో విషయం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మహేష్‌ఫ్యాన్స్ పేజీల్లో "సూపర్‌ మాసీవ్‌ అనౌన్స్ మెంట్‌. తుఫాన్ లాంటి ఈ అనౌన్స్ మెంట్‌  ప్రపంచ సినిమా చరిత్రలో మొదటిసారి జరగబోతోంది. అది కూడా సూపర్‌ ఫ్యాన్స్  కోసమే. గట్టిగా సెలబ్రేట్‌ చేసుకుందాం’ అంటూ సోషల్‌మీడియాలో కొన్ని పోస్టర్లు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ సర్‌ప్రైజ్‌ ఏంటనేది సస్పెన్స్  ఉంది. దీనిపై నిర్మాతల నుంచి ఎలాంటి సమాచారం లేదు. సినిమా విడుదల సందర్బంగా అభిమానుల  కోసం మహేష్‌బాబు తన ఫ్యాన్స్  కోసం ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేశారా? ప్రీమియర్‌ షో, ఇంటరాక్షన్  లాంటివి ఏదో ఏర్పాటు చేశారని భావిస్తున్నారు. అయితే సర్‌ప్రైజ్‌ ఏంటనే ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తెలియనుంది.

మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల. మీనాక్షి చౌదరి నాయికలు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated Date - Jan 02 , 2024 | 04:36 PM